వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ కింద రూ.25 లక్షల వరకూ ఉచిత చికిత్స: సిఎం జగన్‌

- December 13, 2023 , by Maagulf
వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ కింద రూ.25 లక్షల వరకూ ఉచిత చికిత్స: సిఎం జగన్‌

అమరావతి: వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ కింద రూ. 25 లక్షల వరకూ చికిత్స ఉచితం అని సిఎం జగన్‌ ప్రకటించారు. ఈరోజు వైఎఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ పథకం పై సీఎం జగన్ రివ్యూ నిర్వహించారు. ఈ సందర్బంగా సీఎం జగన్ మాట్లాడుతూ…వైఎఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ పథకం పై అధికారులకు పలు కీలక ఆదేశాలు ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఇది చరిత్రాత్మక నిర్ణయం.. ఆరోగ్యం, విద్య ప్రజలకు ఒక హక్కు గా లభించాలన్నారు. ఈ హక్కులను కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని వెల్లడించారు. అధికారంలోకి వచ్చిన రోజు నుంచే ఈ అంశాలపై విశేష కృషి చేశామన్నారు. వైఎఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వం చేస్తున్న ఖర్చులే దీనికి ఉదాహరణ అన్నారు. ఆరోగ్య శ్రీ కింద రూ.25 లక్షల వరకూ ఉచిత చికిత్స కార్యక్రమాన్ని చేపట్టాం అని సిఎం జగన్‌ వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com