సస్పెన్షన్కు గురైన ఎంపీల నిరసన..
- December 15, 2023
న్యూఢిల్లీ: పార్లమెంట్ లో స్మోక్ అటాక్ ఘటనను ఖండిస్తూ ఆందోళన చేపట్టిన 14 మంది ఎంపీలను గురువారం సెషన్ మొత్తం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. సస్పెన్షన్కు గురైన ఆ ఎంపీలు ఈరోజు పార్లమెంట్ ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహం ముందు నిరసన చేపట్టారు. సస్పెండ్ అయినవారిలో 13 మంది లోక్సభలో, ఒక రాజ్యసభ సభ్యుడు ఉన్నారు. ఆ ఎంపీలు ప్లకార్డులు పట్టుకుని ప్రదర్శన చేపట్టారు. ప్రజాస్వామ్యం డౌన్డౌన్ అన్న ప్లకార్డులు పట్టుకున్నారు. సైలెంట్ ప్రొటెస్ట్ టీషర్ట్ ను డెరిక్ ఒబ్రెయిన్ వేసుకున్నారు.
మరో వైపు నేడు ఉభయసభలు వాయిదాపడ్డాయి. లోక్సభ, రాజ్యసభ ప్రారంభంకాగానే.. విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. దీంతో రెండు సభలను మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేశారు. స్పీకర్ ఓం బిర్లా ఇచ్చిన ఆదేశాలనే ప్రభుత్వం పాటిస్తోందని పార్లమెంటరీ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. స్మోక్ ఘటన అంశం ప్రస్తుతం కోర్టులో ఉందన్నారు.
కాగా, పార్లమెంట్ మకర ద్వారం వద్ద నిరసన చేపడుతున్న సస్పెండ్ అయిన ఎంపీలను కాంగ్రెస్ పార్టీ నేత సోనియా గాంధీ కలిశారు.
తాజా వార్తలు
- మాదక ద్రవ్యాల రవాణా పై ఒమన్ పోలీసులు ఉక్కుపాదం..!!
- NRI ఓటర్ల హక్కుల పరిరక్షణకు అవగాహన పెంచాలి: సౌదీ తెలుగు అసోసియేషన్
- సౌదీలో డెలివరీ యాప్లను హెచ్చరించిన ట్రాన్స్పోర్ట్ అథారిటీ..!!
- దోఫార్లో సైబర్ మోసాల ముఠా అరెస్ట్..!!
- యూఏఈలో 50°C దాటనున్న ఉష్ణోగ్రతలు..వర్షాలతో ఉపశమనం..!!
- ఆకట్టుకున్న 'ఇమేజ్ ఇన్ బహ్రెయిన్' మహిళల ఫోటోగ్రఫీ పోటీ..!!
- రాస్ లఫాన్ ఘటనపై చర్చించిన అమీర్, ప్రధాని మోదీ..!!
- సమ్మర్ లో అగ్ని ప్రమాదాలు..కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- తెలంగాణకు వర్షాల అలర్ట్..
- ఎన్ఆర్ఐల ఓటు హక్కులను కాపాడాలి: సౌదీ తెలుగు అసోసియేషన్ విజ్ఞప్తి







