భారత్ లో పర్యటిస్తున్న ఒమన్ సుల్తాన్
- December 16, 2023
న్యూఢిల్లీ: సుల్తాన్ హైతం బిన్ తారిక్ తన తొలి భారత పర్యటన కోసం న్యూఢిల్లీ విమానాశ్రయంలో అడుగుపెట్టారు. ఆయనకు భారత విదేశాంగ మరియు పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి (MoS) వి మురళీధరన్ స్వాగతం పలికారు. మురళీధరన్ అక్టోబర్ 18 నుండి 19 వరకు ఒమన్ సుల్తానేట్లో అధికారిక పర్యటన చేశారు. "ఒమన్ హిజ్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ భారతదేశానికి తన మొదటి రాష్ట్ర పర్యటన సందర్భంగా న్యూ ఢిల్లీలో అడుగుపెట్టారు. విమానాశ్రయంలో మురళీధరన్ స్వాగతం పలికారు. ఈ పర్యటన భారతదేశం - ఒమన్ మధ్య దీర్ఘకాల స్నేహం, సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుంది." అని MEA ప్రతినిధి అరిందమ్ బాగ్చి ఎక్స్(ట్విటర్) లో పోస్ట్ చేసారు. ఒమన్ సుల్తాన్ మూడు రోజులపాటు భారత్ లో పర్యటించనున్నారు.డిసెంబర్ 16న రాష్ట్రపతి భవన్లో ప్రధాని మోడీ మరియు ప్రెసిడెంట్ ముర్ములను సుల్తాన్ అధికారికంగా భేటీ కానున్నారు. అనంతరం నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్ను కూడా సందర్శించి, హైదరాబాద్ హౌస్లో ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష