భారత్ లో పర్యటిస్తున్న ఒమన్ సుల్తాన్
- December 16, 2023
న్యూఢిల్లీ: సుల్తాన్ హైతం బిన్ తారిక్ తన తొలి భారత పర్యటన కోసం న్యూఢిల్లీ విమానాశ్రయంలో అడుగుపెట్టారు. ఆయనకు భారత విదేశాంగ మరియు పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి (MoS) వి మురళీధరన్ స్వాగతం పలికారు. మురళీధరన్ అక్టోబర్ 18 నుండి 19 వరకు ఒమన్ సుల్తానేట్లో అధికారిక పర్యటన చేశారు. "ఒమన్ హిజ్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ భారతదేశానికి తన మొదటి రాష్ట్ర పర్యటన సందర్భంగా న్యూ ఢిల్లీలో అడుగుపెట్టారు. విమానాశ్రయంలో మురళీధరన్ స్వాగతం పలికారు. ఈ పర్యటన భారతదేశం - ఒమన్ మధ్య దీర్ఘకాల స్నేహం, సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుంది." అని MEA ప్రతినిధి అరిందమ్ బాగ్చి ఎక్స్(ట్విటర్) లో పోస్ట్ చేసారు. ఒమన్ సుల్తాన్ మూడు రోజులపాటు భారత్ లో పర్యటించనున్నారు.డిసెంబర్ 16న రాష్ట్రపతి భవన్లో ప్రధాని మోడీ మరియు ప్రెసిడెంట్ ముర్ములను సుల్తాన్ అధికారికంగా భేటీ కానున్నారు. అనంతరం నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్ను కూడా సందర్శించి, హైదరాబాద్ హౌస్లో ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు.
తాజా వార్తలు
- సైబర్ నేరగాడిని అరెస్టు చేసిన పోలీసులు
- ఐపీఎల్ 2026 ప్రారంభం వాయిదా? కొత్త తేదీలు ఇవే!
- యూఏఈకి ‘కోల్డ్ వేవ్’ హెచ్చరిక
- ఇంటర్, పదవ తరగతి విద్యార్థులకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ శుభాకాంక్షలు
- అజ్మాన్ పోలీస్ సరికొత్త రికార్డు
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు
- నకిలీ సంస్థ పేరిట మ్యూల్ ఖాతాలు: బ్యాంకు మేనేజర్ సహా నలుగురి అరెస్ట్
- 17 రోజులు బ్యాంకులకు సెలవులు
- TGSRTC: ‘మీ టికెట్’ యాప్తో బస్పాస్లు ఇక డిజిటల్
- 16 ఏళ్ల లోపు యూజర్ల కోసం ఇన్స్టాగ్రామ్ కొత్త సేఫ్టీ అలర్ట్









