భారత్ లో పర్యటిస్తున్న ఒమన్ సుల్తాన్
- December 16, 2023
న్యూఢిల్లీ: సుల్తాన్ హైతం బిన్ తారిక్ తన తొలి భారత పర్యటన కోసం న్యూఢిల్లీ విమానాశ్రయంలో అడుగుపెట్టారు. ఆయనకు భారత విదేశాంగ మరియు పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి (MoS) వి మురళీధరన్ స్వాగతం పలికారు. మురళీధరన్ అక్టోబర్ 18 నుండి 19 వరకు ఒమన్ సుల్తానేట్లో అధికారిక పర్యటన చేశారు. "ఒమన్ హిజ్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ భారతదేశానికి తన మొదటి రాష్ట్ర పర్యటన సందర్భంగా న్యూ ఢిల్లీలో అడుగుపెట్టారు. విమానాశ్రయంలో మురళీధరన్ స్వాగతం పలికారు. ఈ పర్యటన భారతదేశం - ఒమన్ మధ్య దీర్ఘకాల స్నేహం, సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుంది." అని MEA ప్రతినిధి అరిందమ్ బాగ్చి ఎక్స్(ట్విటర్) లో పోస్ట్ చేసారు. ఒమన్ సుల్తాన్ మూడు రోజులపాటు భారత్ లో పర్యటించనున్నారు.డిసెంబర్ 16న రాష్ట్రపతి భవన్లో ప్రధాని మోడీ మరియు ప్రెసిడెంట్ ముర్ములను సుల్తాన్ అధికారికంగా భేటీ కానున్నారు. అనంతరం నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్ను కూడా సందర్శించి, హైదరాబాద్ హౌస్లో ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు.
తాజా వార్తలు
- సాదియాత్ ఐలాండ్ లో ‘దార్ అల్ ఫునూన్’ నిర్మాణానికి శ్రీకారం
- ముగ్గురు సీఎంలు ఒకే వేదిక పై.. చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్..
- యూఏఈ-భారత్ ప్రయాణికులకు కొత్త నిబంధన
- జూలై 9 నుంచి మస్కట్–అబుదాబి మధ్య ఒమన్ ఎయిర్ రోజువారీ విమాన సర్వీసులు
- తెలంగాణ ఉద్యోగులకు భద్రతే భరోసా..
- FIFA ప్రపంచ కప్ ట్రోఫీ విలువ ఎంతో తెలుసా?
- పాస్పోర్ట్ ఫీజుల భారీ పెంపు
- కార్మికుల కోసం దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో మూడు వినూత్న ప్రాజెక్టులు..
- ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘అవర్ ఫ్లెక్సిబుల్ సమ్మర్’ కార్యక్రమం అమలు ప్రారంభించిన దుబాయ్







