భారత్ లో పర్యటిస్తున్న ఒమన్ సుల్తాన్
- December 16, 2023
న్యూఢిల్లీ: సుల్తాన్ హైతం బిన్ తారిక్ తన తొలి భారత పర్యటన కోసం న్యూఢిల్లీ విమానాశ్రయంలో అడుగుపెట్టారు. ఆయనకు భారత విదేశాంగ మరియు పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి (MoS) వి మురళీధరన్ స్వాగతం పలికారు. మురళీధరన్ అక్టోబర్ 18 నుండి 19 వరకు ఒమన్ సుల్తానేట్లో అధికారిక పర్యటన చేశారు. "ఒమన్ హిజ్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ భారతదేశానికి తన మొదటి రాష్ట్ర పర్యటన సందర్భంగా న్యూ ఢిల్లీలో అడుగుపెట్టారు. విమానాశ్రయంలో మురళీధరన్ స్వాగతం పలికారు. ఈ పర్యటన భారతదేశం - ఒమన్ మధ్య దీర్ఘకాల స్నేహం, సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుంది." అని MEA ప్రతినిధి అరిందమ్ బాగ్చి ఎక్స్(ట్విటర్) లో పోస్ట్ చేసారు. ఒమన్ సుల్తాన్ మూడు రోజులపాటు భారత్ లో పర్యటించనున్నారు.డిసెంబర్ 16న రాష్ట్రపతి భవన్లో ప్రధాని మోడీ మరియు ప్రెసిడెంట్ ముర్ములను సుల్తాన్ అధికారికంగా భేటీ కానున్నారు. అనంతరం నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్ను కూడా సందర్శించి, హైదరాబాద్ హౌస్లో ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు.
తాజా వార్తలు
- ఎన్నికల తేదీల కోసం జనాల ఎదురు చూపులు: కేటీఆర్
- దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి..!
- విద్యుత్ ఛార్జీలు పెంచనున్నాం: సీఎం చంద్రబాబు
- ఆస్ట్రేలియాలో 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం అమలు…
- దోహా ఫోరం 2025: QR2.016 బిలియన్ల విలువైన ఒప్పందాలు..!!
- అల్-రాయ్లో ఇద్దరు కార్మికులు మృతి..!!
- యునెస్కో జాబితాలో ఒమన్ 'బిష్ట్' రిజిస్టర్..!!
- బహ్రెయిన్ లో నేషనల్ డే ,యాక్సెషన్ డే సెలవులు అనౌన్స్..!!
- అల్ రీమ్ ద్వీపంలోని భవనంలో అగ్నిప్రమాదం..!!
- సౌదీ అరేబియాలో చల్లబడ్డ వాతావరణం..!!







