దాసరి, చిరంజీవిలు.. ముద్రగడ ఉద్యమానికి పూర్తి మద్దతు..
- May 28, 2016
కాపులకు రిజర్వేషన్ల లక్ష్యంగా రోడ్డెక్కిన ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభానికి క్రమంగా మద్దతు పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. గతరాత్రి హైదరాబాద్ చేరుకున్న ఆయన, ఉదయం నుంచి రాజకీయ పార్టీల నేతలతో ఎడతెగని మంతనాలు జరిపారు. పిసిసి చీఫ్ రఘువీరారెడ్డి, కాంగ్రెస్ ఎంపి చిరంజీవి, మాజీ కేంద్రమంద్రి దాసరి నారాయణరావులతో ఆయన సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికల సందర్భంగా టిడిపి ఇచ్చిన హామీని నేతల వద్ద ముద్రగడ ప్రస్తావించారు. భేటీ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన దాసరి, చిరంజీవిలు.. ముద్రగడ ఉద్యమానికి పూర్తి మద్దతు ప్రకటించారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని నేతలు డిమాండ్ చేశారు. చంద్రబాబు కాపులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని నేతలు కోరారు.
తాజా వార్తలు
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!







