దాసరి, చిరంజీవిలు.. ముద్రగడ ఉద్యమానికి పూర్తి మద్దతు..

- May 28, 2016 , by Maagulf
దాసరి, చిరంజీవిలు.. ముద్రగడ ఉద్యమానికి పూర్తి మద్దతు..

కాపులకు రిజర్వేషన్ల లక్ష్యంగా రోడ్డెక్కిన ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభానికి క్రమంగా మద్దతు పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. గతరాత్రి హైదరాబాద్ చేరుకున్న ఆయన, ఉదయం నుంచి రాజకీయ పార్టీల నేతలతో ఎడతెగని మంతనాలు జరిపారు. పిసిసి చీఫ్ రఘువీరారెడ్డి, కాంగ్రెస్ ఎంపి చిరంజీవి, మాజీ కేంద్రమంద్రి దాసరి నారాయణరావులతో ఆయన సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికల సందర్భంగా టిడిపి ఇచ్చిన హామీని నేతల వద్ద ముద్రగడ ప్రస్తావించారు. భేటీ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన దాసరి, చిరంజీవిలు.. ముద్రగడ ఉద్యమానికి పూర్తి మద్దతు ప్రకటించారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని నేతలు డిమాండ్ చేశారు. చంద్రబాబు కాపులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని నేతలు కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com