దాసరి, చిరంజీవిలు.. ముద్రగడ ఉద్యమానికి పూర్తి మద్దతు..
- May 28, 2016
కాపులకు రిజర్వేషన్ల లక్ష్యంగా రోడ్డెక్కిన ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభానికి క్రమంగా మద్దతు పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. గతరాత్రి హైదరాబాద్ చేరుకున్న ఆయన, ఉదయం నుంచి రాజకీయ పార్టీల నేతలతో ఎడతెగని మంతనాలు జరిపారు. పిసిసి చీఫ్ రఘువీరారెడ్డి, కాంగ్రెస్ ఎంపి చిరంజీవి, మాజీ కేంద్రమంద్రి దాసరి నారాయణరావులతో ఆయన సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికల సందర్భంగా టిడిపి ఇచ్చిన హామీని నేతల వద్ద ముద్రగడ ప్రస్తావించారు. భేటీ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన దాసరి, చిరంజీవిలు.. ముద్రగడ ఉద్యమానికి పూర్తి మద్దతు ప్రకటించారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని నేతలు డిమాండ్ చేశారు. చంద్రబాబు కాపులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని నేతలు కోరారు.
తాజా వార్తలు
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం
- గద్దర్ ఫిలిం అవార్డ్స్: విజేతల పూర్తి జాబితా ఇదే!
- బెంగళూరుకు రెండో అంతర్జాతీయ విమానాశ్రయం!
- సీఎం సమక్షంలో 124 మంది మావోయిస్టుల లొంగుబాటు
- క్షమించడండి అంటూ ఇరాన్ అధ్యక్షుడి కీలక ప్రకటన
- *బ్రేకింగ్: విమాన సర్వీసులను పునరుద్ధరించిన ఎమిరేట్స్! కన్ఫర్మ్డ్ టికెట్ ఉన్న ప్రయాణీకులకే!
- క్షతగాత్రులను పరామర్శించిన యుఏఈ అధ్యక్షుడు
- దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?









