కొవిడ్ జేఎన్1 సబ్వేరియంట్ వ్యాప్తి..
- December 19, 2023
న్యూ ఢిల్లీ: భారత దేశంలో మళ్లీ కొవిడ్-19 కొత్త సబ్ వేరియంట్ జేఎన్ 1 వ్యాప్తి చెందుతుండటంతో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ అప్రమత్తం అయింది. క్రిస్మస్, కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా ప్రజలకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది. పండుగల సందర్భంగా కొవిడ్ వ్యాప్తి చెందకుండా ప్రజలు ముఖ్యంగా 60 ఏళ్ల వయసు పైబడిన వృద్ధులు మాస్కులు ధరించాలని వైద్యాధికారులు సూచించారు. కేరళ, గోవా రాష్ట్రాల్లో కొవిడ్ కేసులు పెరిగాయి.
కొవిడ్ జేఎన్ 1 సబ్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందే అవకాశాలున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది. కర్ణాటక రాష్ట్రంలోనూ జేఎన్ 1 సబ్ వేరియంట్ ప్రబలిన నేపథ్యంలో ప్రజలు మాస్కులు ధరించాలని కర్ణాటక వైద్య ఆరోగ్యశాఖ సూచించింది. కొవిడ్ కొత్త సబ్ వేరియంట్ ముప్పు వృద్ధులు, వ్యాధిగ్రస్తులకు ఎక్కువగా ఉందని వైద్యాధికారులు అంటున్నారు.
భారతదేశంలో చాలామందికి కొవిడ్ రెండు లేదా మూడుసార్లు వచ్చింది. 95 శాతం కంటే ఎక్కువమంది ప్రజలు రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ తీసుకున్నందు వల్ల వారికి ఈ కొత్త కొవిడ్ వైరస్ వచ్చే ప్రమాదం లేదని ఎయిమ్స్ పల్మోనాలజీ విభాగం మాజీ అధిపతి, పీఎస్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పల్మనరీ, క్రిటికల్ కేర్ అండ్ స్లీప్ మెడిసిన్ చైర్మన్ డాక్టర్ జీసీ ఖిల్నాని చప్పారు.
తాజా వార్తలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత
- ఖమేనీ అంత్యక్రియలకు ప్రధాని మోదీ దూరం..
- నెలల విరామం తర్వాత ఇరాన్–యూఏఈ మధ్య విమాన సర్వీసులు పునఃప్రారంభం
- సెమీకండక్టర్–ఏఐ అవకాశాలకు తైవాన్కు ICIE ఆహ్వానం
- తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు..డీజీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు







