కొవిడ్ జేఎన్1 సబ్వేరియంట్ వ్యాప్తి..
- December 19, 2023
న్యూ ఢిల్లీ: భారత దేశంలో మళ్లీ కొవిడ్-19 కొత్త సబ్ వేరియంట్ జేఎన్ 1 వ్యాప్తి చెందుతుండటంతో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ అప్రమత్తం అయింది. క్రిస్మస్, కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా ప్రజలకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది. పండుగల సందర్భంగా కొవిడ్ వ్యాప్తి చెందకుండా ప్రజలు ముఖ్యంగా 60 ఏళ్ల వయసు పైబడిన వృద్ధులు మాస్కులు ధరించాలని వైద్యాధికారులు సూచించారు. కేరళ, గోవా రాష్ట్రాల్లో కొవిడ్ కేసులు పెరిగాయి.
కొవిడ్ జేఎన్ 1 సబ్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందే అవకాశాలున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది. కర్ణాటక రాష్ట్రంలోనూ జేఎన్ 1 సబ్ వేరియంట్ ప్రబలిన నేపథ్యంలో ప్రజలు మాస్కులు ధరించాలని కర్ణాటక వైద్య ఆరోగ్యశాఖ సూచించింది. కొవిడ్ కొత్త సబ్ వేరియంట్ ముప్పు వృద్ధులు, వ్యాధిగ్రస్తులకు ఎక్కువగా ఉందని వైద్యాధికారులు అంటున్నారు.
భారతదేశంలో చాలామందికి కొవిడ్ రెండు లేదా మూడుసార్లు వచ్చింది. 95 శాతం కంటే ఎక్కువమంది ప్రజలు రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ తీసుకున్నందు వల్ల వారికి ఈ కొత్త కొవిడ్ వైరస్ వచ్చే ప్రమాదం లేదని ఎయిమ్స్ పల్మోనాలజీ విభాగం మాజీ అధిపతి, పీఎస్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పల్మనరీ, క్రిటికల్ కేర్ అండ్ స్లీప్ మెడిసిన్ చైర్మన్ డాక్టర్ జీసీ ఖిల్నాని చప్పారు.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









