విదేశీయుల వర్క్ పర్మిట్ల ఫీ పెంపుపై పార్లమెంట్ లో చర్చ
- December 20, 2023
బహ్రెయిన్: బహ్రెయిన్ పార్లమెంటులో విదేశీయుల వర్క్ పర్మిట్ల ఫీ పెంపుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా కొందరు ఎంపీలు చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని లేపాయి. దేశంలోని దాదాపు 16,500 మంది విదేశీ కార్మికులు BD1,000+ నెలవారీ జీతంతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారని కొందరు ఎంపీలు చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని రాజేశాయి. ఈ వ్యాఖ్యలు విదేశీ కార్మికులను నియమించడానికి ఫీజులను పెంచే ప్రతిపాదనకు ఆజ్యం పోసింది. బహ్రెయిన్స్కు ఉపాధి అవకాశాలను పెంచే లక్ష్యంతో ఈ చర్యలు తీసుకోవాలని మరికొందరు డిమాండ్ చేశారు. కానీ వాస్తవ విషయాలు మరోలా ఉన్నాయి. ప్రభుత్వ డేటా ప్రకారం.. బహ్రెయిన్ లో ప్రైవేట్ రంగంలో సగటు బహ్రెయిని జీతం కంటే విదేశీ కార్మికుని జీతం మూడు రెట్లు తక్కువగా ఉన్నది. బహ్రెయిన్లకు బిడి 815 ఉంటే నాన్ బహ్రెయిన్లకు బిడి 260గా ఉన్నది. సామాజిక భీమా సంస్థ తన ‘స్టాటిస్టికల్ రిపోర్ట్ 2023 - క్వార్టర్ 3’ లో విడుదల చేసింది.ఇందలోనూ బహ్రెయిన్స్కు BD450 ఉంటే.. విదేశీ కార్మికుల సాలరీ BD110 గా పేర్కొంది. బహ్రెయినీ గ్రాడ్యుయేట్లు సగటున BD446 సంపాదిస్తుండగా.. నాన్ బహ్రెయినలు BD193 మాత్రమే సంపాదిస్తున్నారు. అదే సమయంలో బహ్రెయినీ ప్రభుత్వ రంగ ఉద్యోగులు సగటున BD945 సంపాదిస్తున్నారు. కాబట్టి, కొంతమంది విదేశీయులు నిజంగా BD1,000 మార్కుకు చేరుకోగలిగినప్పటికీ, వారు మొత్తం సంఖ్యతో పోలిస్తే ఒక్క శాతం కంటే తక్కువే ఉంటారని నిపుణులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో వర్క్ పర్మిట్ల ఫీపై బహ్రెయిన్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.
తాజా వార్తలు
- భారతదేశంలోని 9 నగరాలకు జజీరా విమాన సర్వీసుల తాత్కాలిక రద్దు
- అనంతపురాన్ని సేవతో మార్చిన ఫాదర్ విన్సెంట్ ఫెరర్ జయంతి నేడు
- విద్యాభివృద్ధికి రూ.110 కోట్లు.. ముందుకొచ్చిన కార్పొరేట్ సంస్థలు
- కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు..
- లూలు మాల్కు భూకేటాయింపు రద్దు
- తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు ఇండియన్ రైల్వే గుడ్ న్యూస్
- తమిళనాడు ప్రధాన కార్యదర్శిగా ఎం.సాయి కుమార్ బాధ్యతలు స్వీకారం
- టీవీ యూజర్లకు బిగ్ షాక్ ఇచ్చిన యూట్యూబ్
- కువైట్ లో విషాదం..రోడ్డు పై 5 మంది మృతి!!
- ప్రయాణికులకు ఊరట.. గల్ఫ్ ఎయిర్ కార్యకలాపాలు ప్రారంభం..!!









