వైఎస్ జగన్‌ కి 'ఆటా' మహాసభలకు పిలుపు

- May 28, 2016 , by Maagulf
వైఎస్ జగన్‌ కి 'ఆటా' మహాసభలకు పిలుపు

 వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని 'ఆటా' మహాసభల్లో పాల్గొనడానికి అమెరికాకు రావాల్సిందిగా అక్కడ నివసించే తెలుగువారు ఆహ్వానించారు. 'ఆటా' ప్రెసిడెంట్ ఎలెక్ట్ ఎ.సి.కరుణాకర్‌రెడ్డి, కోఆర్డినేటర్ దగ్గుమాటి కోటిరెడ్డి శనివారం ఉదయం జగన్‌ను ఆయన నివాసంలో కలుసుకుని ఈ మేరకు ఆహ్వానం అందజేశారు. 'ఆటా' మహాసభలు జూలై 1, 2,3 తేదీల్లో చికాగోలో జరుగుతాయని వారు జగన్‌కు వివరించారు. జగన్ ఈ ఆహ్వానాన్ని మన్నిస్తూ పార్టీ తరపున ఒక ప్రతినిధి బృందాన్ని సభలకు పంపుతామని చెప్పినట్లు 'ఆటా' ప్రతినిధులు తెలిపారు. ఆహ్వానం అందిస్తున్న సమయంలో పార్టీ ముఖ్యనేతలు బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com