వైఎస్ జగన్ కి 'ఆటా' మహాసభలకు పిలుపు
- May 28, 2016
వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని 'ఆటా' మహాసభల్లో పాల్గొనడానికి అమెరికాకు రావాల్సిందిగా అక్కడ నివసించే తెలుగువారు ఆహ్వానించారు. 'ఆటా' ప్రెసిడెంట్ ఎలెక్ట్ ఎ.సి.కరుణాకర్రెడ్డి, కోఆర్డినేటర్ దగ్గుమాటి కోటిరెడ్డి శనివారం ఉదయం జగన్ను ఆయన నివాసంలో కలుసుకుని ఈ మేరకు ఆహ్వానం అందజేశారు. 'ఆటా' మహాసభలు జూలై 1, 2,3 తేదీల్లో చికాగోలో జరుగుతాయని వారు జగన్కు వివరించారు. జగన్ ఈ ఆహ్వానాన్ని మన్నిస్తూ పార్టీ తరపున ఒక ప్రతినిధి బృందాన్ని సభలకు పంపుతామని చెప్పినట్లు 'ఆటా' ప్రతినిధులు తెలిపారు. ఆహ్వానం అందిస్తున్న సమయంలో పార్టీ ముఖ్యనేతలు బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







