హైదరాబాద్ అంకుర హాస్పటల్ లో ఘోర అగ్నిప్రమాదం
- December 24, 2023
హైదరాబాద్: హైదరాబాద్ లో వరుస అగ్ని ప్రమాద ఘటనలు నగరవాసులను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. ప్రతి రోజు ఎక్కడో ఓ చోట అగ్ని ప్రమాద వార్త వెలుగులోకి వస్తూనే ఉంది. తాజాగా శనివారం సాయంత్రం మెహదీపట్నంలోని అంకుర హాస్పటల్ లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక జ్యోతినగర్ ప్రాంతంలోని పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వేలోని పిల్లర్ నెంబర్ 68 దగ్గరలో ఉన్న ఆసుపత్రిలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్లతో సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఐదోఫ్లోర్ నుంచి పదో ఫ్లోర్ వరకు మంటలు అంటుకున్నాయి. పైనుంచి అగ్నికీలలు కిందపడుతున్నాయి. అయితే, అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియ రాలేదు. ఆసుపత్రిలో ఎక్కువగా గర్భిణులు, చిన్నారులు ఉన్నారు. మంటలను గమనించిన హాస్పిటల్ సిబ్బంది పేషెంట్లను వెంటనే బయటకు పంపారు. హాస్పిటల్ నేమ్ బోర్డుకు మంటలు అంటుకున్నాయి. బోర్డు పక్కనే ఫ్లెక్సీలు అంటుకోవడంతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నాలుగు ఫైరింజన్ల సహాయంతో అగ్నిమాపక సిబ్బంది, జీహెచ్ఎంసీ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ప్రస్తుతం అధికారులు , పోలీసు సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు మొదలుపెట్టారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో కురవనున్న భారీ వర్షాలు: ఎల్లో అలర్ట్ జారీ
- భూకంపంలో స్టార్ ప్లేయర్ భార్య, ఇద్దరు పిల్లలు మృతి!
- వ్యక్తి వయస్సును ఒక సంవత్సరం తగ్గించిన కోర్టు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై సౌదీ క్రౌన్ ప్రిన్స్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- అభిమానుల నిద్రవేళలను తిరగరాస్తోన్న ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఫీవర్..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఫ్లైట్ టిక్కెట్ ధరల్లో భారీగా వ్యత్యాసాలు..!!
- లూసైల్ ట్రామ్ నిలిపివేతతో ప్రభావితమైన ప్రాంతాలకు కొత్త మెట్రోలింక్..!!
- జూలై 3 నుండి కువైట్లో సమ్మర్ హాటెస్ట్ సీజన్ ప్రారంభం..!!
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..







