తెలంగాణ ఏసీబీ డీజీగా సీవీ ఆనంద్ బాధ్యతలు
- December 24, 2023
హైదరాబాద్: తెలంగాణ ఏసీబీ డీజీగా ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు. రెండేళ్లపాటు హైదరాబాద్ సీపీగా పని చేసిన ఆయనను కాంగ్రెస్ ప్రభుత్వం ఏసీబీ డీజీగా నియమించింది. ఈ నేపథ్యంలో ఆయన ఈ రోజు బాధ్యతలను స్వీకరించారు. ఆయనకు ఏసీబీ కార్యాలయ సిబ్బంది, ఇతర ఉద్యోగులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సీవీ ఆనంద్ ట్వీట్ చేశారు.
రెండేళ్లపాటు హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా తాను కొనసాగానని ఆయన పేర్కొన్నారు.
శాంతిభద్రతలను పటిష్ఠంగా ఉంచానని పేర్కొన్నారు. అది తనకు వృత్తిపరంగా చాలా సంతృప్తిని ఇచ్చిందన్నారు. ఒకేసారి అన్ని రకాల పండుగలు వచ్చినప్పటికీ… ఎక్కడా మతసామరస్యం దెబ్బతినకుండా ప్రశాంతంగా పండుగలను నిర్వహించినట్లు తెలిపారు. సైబర్ క్రైమ్లో గతంలో ఎన్నడూ చూడని నేరాలను చూసినట్లు తెలిపారు. ఇక ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నామన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







