బహ్రెయిన్లో భారతీయ ప్రవాసుడు ఆత్మహత్య
- December 27, 2023
బహ్రెయిన్: బహ్రెయిన్కు చెందిన ఒక శక్తివంతమైన భారతీయ ప్రవాసుడు ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక పరమైన సమస్యలతోనే అతను ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. వివరాల్లోకి వెళితే..భారతదేశంలోని కేరళకు చెందిన 53 ఏళ్ల సునీల్ కుమార్ అనే వ్యక్తి గత వారం తన సార్ నివాసంలో శవమై కనిపించాడు. ఆత్మహత్య చేసుకున్న ఉరి కారణంగా కార్డియోపల్మోనరీ అరెస్ట్తో మృతి చెందినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. సునీల్ కుమార్ కుటుంబం, భారత రాయబార కార్యాలయం మరియు షిఫా అల్ జసీరా హాస్పిటల్ మద్దతుతో అతని మృతదేహాన్ని భారతదేశానికి తరలించారు. బహ్రెయిన్లో ఇటీవల ప్రవాసుల ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్నాయని సుధీర్ తిరునిలత్ అనే సామాజిక కార్యకర్త ఆందోళన వ్యక్తం చేశారు. సామాజిక సంస్థల్లో చురుగ్గా పాల్గొంటూ ఇతరులకు మద్దతుగా నిలిచే సునీల్ కుమార్ లాంటి వ్యక్తి మరణించడం బాధిస్తుందన్నారు. సునీల్ లాంటి వ్యక్తికే ఆర్థిక ఇబ్బందులు ఎదురైతే, సాధారణ వ్యక్తుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఆర్థిక సమస్యలు ప్రవాసులకు ముఖ్యమైన ఆందోళనగా మారాయని, పెరుగుతున్న జీవన వ్యయానికి అనుగుణంగా ప్రవాసుల జీతాలను పెంచే అంశాన్ని పరిశీలించాలని అధికారులను ఆయన కోరారు. దీంతోపాటు ప్రవాసుల ఆత్మహత్యలకు గల మూలకారణాలను అధికారులు పరిశోధించి, సమస్యను సమర్థవంతంగా పరిష్కరించడానికి సమగ్ర వ్యూహాలను రూపొందించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.
తాజా వార్తలు
- మహిళల హకీ ఆసియా కప్లో ఫైనల్కు భారత్
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!
- కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం..!!
- ప్రాంతీయ పరిణామాలపై యూఎన్ సెక్రటరీ జనరల్ ఆరా..!!
- అమెరికా వైస్ ప్రెసిడెంట్ తో ఖతార్ పీఎం సమావేశం..!!
- పోలీసుల అదుపులో పలువురు మోటార్ సైక్లిస్టులు..!!
- బీసీసీఐ అధ్యక్షుడి రేస్ లో ప్రముఖ క్రికెటర్ లు?
- ఒమన్ పై పాక్ విజయం..
- భారత దేశం మొత్తం టపాసులు బ్యాన్..