టాకీ పని పూర్తి చేసుకున్న డా.గజల్ "అనుష్టానం"
- June 28, 2015
లలితశ్రీ మూవీస్ పతాకంపై శ్రీ MP రవిరాజ్ రెడ్డి నిర్మాతగా వట్లూరి జయ ప్రకాష్ నారాయణ సహ నిర్మాతగా డా. గజల్ శ్రీనివాస్, మాధవిలత జంటగా నటిస్తున్న అనుష్టానం టాకీ పార్టు పూర్తయిందని దర్శకుడు కృష్ణ వాసా తెలిపారు.
ఇటీవల సారధి స్టుడియోలో నాయకి నాయకులతో యుగళ గీతాన్ని, పతాక సన్నివేశాన్ని ఎంతో హృద్యంగా చిత్రీకరించినట్లు తెలిపారు. భార్య, భర్తల మధ్య ఉండే అనుభందాలను, కొన్ని సున్నితమైన అంశాలను ఈ చిత్రంలో ప్రధాన అంశాలుగా ఉంటాయని, 1950 లో శ్రీ గుడిపాటి వెంకటచలం గారు రాసిన ఒక కథ స్పూర్తితో ఈ చిత్రాన్ని రూపకల్పన చేసినట్లు తెలిపారు. డా. గజల్ శ్రీనివాస్, మాధవిలత పెర్ఫార్మెన్స్ హైలెట్ గా నిలుస్తుందని, సీనియర్ నటి జయలలిత, మలయాళ నటుడు శ్రీ డిసౌజా, రాగిణి, సాయి శర్మ, శ్రీనివాస రెడ్డి, కృష్ణ కిషోర్ లు ఈ చిత్రంలో నటించారని తెలిపారు.
ఈ చిత్రానికి కెమెరామెన్ గా వెంకట హనుమ, ఎడిటింగ్ ఆంజనేయులు, స్క్రీన్ ప్లే, సంగీతం, దర్సకత్వం కృష్ణ వాసా అని, ఈ జూలై నెలలో ఎడిటింగ్, రీరికార్డింగ్ పూర్తి చేసుకుని సెప్టెంబర్ మొదటి వారంలో ఈ సినిమా విడుదలకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









