ఐఎస్ఐఎస్ ఆత్మాహుతి దాడి లో ఇద్దరు భారతీయులు మృతి
- June 28, 2015
కువైట్ లో ఉగ్రదాడి మృతులకు శనివారం సామూహిక అంత్యక్రియలు నిర్వహిస్తున్న దృశ్యం కువైట్ సిటీ: కువైట్ లోని ఇమామ్ సిద్దీఖీ మసీదు వద్ద గత శుక్రవారం ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతిదాడిలో మరణించినవారిలో ఇద్దరు భారతీయులు ఉన్నట్లు విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రకటించింది. ఉత్తరప్రదేశ్ సుల్తాన్ పూర్ జిల్లా వలీపూర్ నకు చెందిన రిజ్వాన్ హుస్సేన్ (31) మసీదులో వాచ్ మన్ గానూ, అంబేద్కర్ నగర్ జిల్లా జలాల్ పూర్ నకు చెందిన ఇబ్నే అబ్బాస్ (25) డ్రైవర్ గానూ కువైట్ లో పనిచేస్తున్నారు. శుక్రవారం ప్రార్థనల కోసం వారు మసీదుకు వెళ్లినప్పుడు పేలుడు సంభవించి మరణించారు. ఈ ఇరువురు సహా మొత్తం 26 మంది ఈ ఘటనలో దుర్మరణం చెందారు. పేలుడు ధాటికి తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న 200 మందిలోనూ పలువురు భారతీయులు ఉన్నారని, వారి పరిస్థితిపై ఎప్పటికప్పుడు నివేదిస్తున్నామని కువైట్ లో భారత దౌత్యవేత్త సునీల్ జైన్ చెప్పారు. కుటుంబసభ్యుల కోరిక ప్రకారం హుస్సేన్, అబ్బాస్ ల మృతదేహాలకు ఇరాక్ లోని పవిత్ర నజాఫ్ నగరంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కాగా, మసీదులో ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఐఎస్ఐఎస్ ఉగ్రవాది సౌదీ అరేబియా జాతీయుడని తెలిసింది.
(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- వీసా బాధలు ఇక లేవు: భారతీయుల కోసం ఫ్రాన్స్ కీలక నిర్ణయం!
- కువైట్ వెలుపల ఉన్నవారి వీసాలకు పొడిగింపు లేదు..!!
- టికెట్ రీఫండ్ సర్వీస్ ప్రకటించిన లేబర్ మినిస్ట్రీ..!!
- అబ్షర్ పర్మిట్తో ఆరు కేటగిరీ వారికి మక్కాలోకి ప్రవేశం..!!
- ప్రాపర్టీ ధరలు, అద్దెలను 30% పెంచనున్న మెట్రో గోల్డ్ లైన్..!!
- అబుదాబి 95% తగ్గిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం..!!
- ఖతార్ ఎయిర్వేస్ యూఏఈ, సిరియాకు రోజువారీ విమాన సర్వీసులు పునఃప్రారంభం
- ఈజీ మనీ కోసం మహిళ అదిరిపోయే స్కెచ్..
- రాంబిల్లిలో గ్రీన్ ఎనర్జీ విప్లవం
- ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్ లీసా గిల్









