Dh15మిలియన్ జాక్పాట్ను గెలుచుకున్న ప్రవాసుడు
- December 30, 2023
యూఏఈ: ఎమిరేట్స్ డ్రాలో ఈజీ6 గేమ్లో ఇటీవల విజేతగా నిలిచిన మహమ్మద్ ఇనామ్.. 2024లో యూఏఈలో కొత్త మిలియనీర్గా 15 మిలియన్ దిర్హామ్ల జాక్పాట్ ప్రైజ్ని కైవసం చేసుకోబోతున్నారు. ఇనామ్ తన జీవితకాల కల అయిన హజ్ యాత్ర చేయాలని అనుకుంటున్నట్లు తెలిపాడు. పాకిస్తాన్లోని ఇస్లామాబాద్కు చెందిన ఇనామ్ యూఏఈలో నివసిస్తున్నారు. అతను అబుదాబిలో ఉన్న ఒక ప్రైవేట్ సంస్థలో ఫైనాన్స్ ఆడిటర్ గా పనిచేస్తున్నారు. “నేను కళ్ళు మూసుకుని యాదృచ్ఛికంగా సంఖ్యలను ఎంచుకున్నాను. నేను ఎంచుకున్న సంఖ్యలు కూడా నాకు తెలియవు. నేను వాటిని గమనించినట్లయితే, నేను వరుసగా 14 మరియు 15 ఎంపిక చేసుకున్నాను. కాల్ వచ్చినప్పుడు తొలుత నమ్మలేదు.’’ అని ఇనామ్ సంతోషం వ్యక్తం చేశాడు. హజ్ తర్వాత యూఏఈ రియల్ ఎస్టేట్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నట్లు ఇనామ్ చెప్పారు. అదేవిధంగా కొంత భాగాన్ని స్వచ్ఛంద కార్యక్రమాలకు కూడా విరాళంగా ఇవ్వనున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు
- హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు..
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!







