Dh15మిలియన్ జాక్పాట్ను గెలుచుకున్న ప్రవాసుడు
- December 30, 2023
యూఏఈ: ఎమిరేట్స్ డ్రాలో ఈజీ6 గేమ్లో ఇటీవల విజేతగా నిలిచిన మహమ్మద్ ఇనామ్.. 2024లో యూఏఈలో కొత్త మిలియనీర్గా 15 మిలియన్ దిర్హామ్ల జాక్పాట్ ప్రైజ్ని కైవసం చేసుకోబోతున్నారు. ఇనామ్ తన జీవితకాల కల అయిన హజ్ యాత్ర చేయాలని అనుకుంటున్నట్లు తెలిపాడు. పాకిస్తాన్లోని ఇస్లామాబాద్కు చెందిన ఇనామ్ యూఏఈలో నివసిస్తున్నారు. అతను అబుదాబిలో ఉన్న ఒక ప్రైవేట్ సంస్థలో ఫైనాన్స్ ఆడిటర్ గా పనిచేస్తున్నారు. “నేను కళ్ళు మూసుకుని యాదృచ్ఛికంగా సంఖ్యలను ఎంచుకున్నాను. నేను ఎంచుకున్న సంఖ్యలు కూడా నాకు తెలియవు. నేను వాటిని గమనించినట్లయితే, నేను వరుసగా 14 మరియు 15 ఎంపిక చేసుకున్నాను. కాల్ వచ్చినప్పుడు తొలుత నమ్మలేదు.’’ అని ఇనామ్ సంతోషం వ్యక్తం చేశాడు. హజ్ తర్వాత యూఏఈ రియల్ ఎస్టేట్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నట్లు ఇనామ్ చెప్పారు. అదేవిధంగా కొంత భాగాన్ని స్వచ్ఛంద కార్యక్రమాలకు కూడా విరాళంగా ఇవ్వనున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









