Dh15మిలియన్ జాక్పాట్ను గెలుచుకున్న ప్రవాసుడు
- December 30, 2023
యూఏఈ: ఎమిరేట్స్ డ్రాలో ఈజీ6 గేమ్లో ఇటీవల విజేతగా నిలిచిన మహమ్మద్ ఇనామ్.. 2024లో యూఏఈలో కొత్త మిలియనీర్గా 15 మిలియన్ దిర్హామ్ల జాక్పాట్ ప్రైజ్ని కైవసం చేసుకోబోతున్నారు. ఇనామ్ తన జీవితకాల కల అయిన హజ్ యాత్ర చేయాలని అనుకుంటున్నట్లు తెలిపాడు. పాకిస్తాన్లోని ఇస్లామాబాద్కు చెందిన ఇనామ్ యూఏఈలో నివసిస్తున్నారు. అతను అబుదాబిలో ఉన్న ఒక ప్రైవేట్ సంస్థలో ఫైనాన్స్ ఆడిటర్ గా పనిచేస్తున్నారు. “నేను కళ్ళు మూసుకుని యాదృచ్ఛికంగా సంఖ్యలను ఎంచుకున్నాను. నేను ఎంచుకున్న సంఖ్యలు కూడా నాకు తెలియవు. నేను వాటిని గమనించినట్లయితే, నేను వరుసగా 14 మరియు 15 ఎంపిక చేసుకున్నాను. కాల్ వచ్చినప్పుడు తొలుత నమ్మలేదు.’’ అని ఇనామ్ సంతోషం వ్యక్తం చేశాడు. హజ్ తర్వాత యూఏఈ రియల్ ఎస్టేట్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నట్లు ఇనామ్ చెప్పారు. అదేవిధంగా కొంత భాగాన్ని స్వచ్ఛంద కార్యక్రమాలకు కూడా విరాళంగా ఇవ్వనున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత
- ఖమేనీ అంత్యక్రియలకు ప్రధాని మోదీ దూరం..
- నెలల విరామం తర్వాత ఇరాన్–యూఏఈ మధ్య విమాన సర్వీసులు పునఃప్రారంభం
- సెమీకండక్టర్–ఏఐ అవకాశాలకు తైవాన్కు ICIE ఆహ్వానం
- తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు..డీజీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు
- టాక్స్ పేయర్లు, సామాన్యులకు అలర్ట్..
- వైజాగ్ విమాన ప్రయాణాల్లో చారిత్రాత్మక మార్పు
- ఇరాన్ అంశం పై మంగళవారం దోహాలో కీలక సమావేశం: ట్రంప్
- అబుదాబిలో డ్రైవర్కు జైలు శిక్ష.. 70,000 దిర్హమ్ల ఫైన్..!!
- సౌదీ అరేబియాకు పలు గల్ఫ్, అరబ్ దేశాలు సంతాపం..!!







