హత్యా నేరం మోపబడిన వ్యక్తిని బెల్జియంకు అప్పగించిన యూఏఈ

- December 30, 2023 , by Maagulf
హత్యా నేరం మోపబడిన వ్యక్తిని బెల్జియంకు అప్పగించిన యూఏఈ

యూఏఈ: నేరగాళ్ల అప్పగింత అభ్యర్థనను అనుసరించి 2023 డిసెంబర్ 29న బెల్జియం అధికారులకు హత్య నేరం మోపబడిన అల్బేనియన్ జాతీయుడైన గెర్గెలీ ఫ్రాంక్‌ను యూఏఈ అప్పగించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బెల్జియం రాజ్యం సంతకం చేసిన అప్పగింత ఒప్పందం ప్రకారం.. యూఏఈ న్యాయ మంత్రి తీర్మానం మేరకు నిందితుడిని సంబంధిత అధికారులకు అప్పగించారు.  యూఏఈ డిసెంబర్ 2021లో బెల్జియం రాజ్యంతో అప్పగింత ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ఒప్పందం అధికారికంగా నవంబర్ 2022లో అమల్లోకి వచ్చింది. వ్యవస్థీకృత నేరాలు, మనీలాండరింగ్, ఉగ్రవాదానికి ఆర్థిక సహాయం, మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు సంబంధించిన ప్రమాదకరమైన ప్రపంచ నేరాలను ఎదుర్కోవడానికి ఇలాంటి ఒప్పందాలు దోహదం చేస్తాయని యూఏఈ లా మినిస్ట్రీ వెల్లడించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com