హత్యా నేరం మోపబడిన వ్యక్తిని బెల్జియంకు అప్పగించిన యూఏఈ
- December 30, 2023
యూఏఈ: నేరగాళ్ల అప్పగింత అభ్యర్థనను అనుసరించి 2023 డిసెంబర్ 29న బెల్జియం అధికారులకు హత్య నేరం మోపబడిన అల్బేనియన్ జాతీయుడైన గెర్గెలీ ఫ్రాంక్ను యూఏఈ అప్పగించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బెల్జియం రాజ్యం సంతకం చేసిన అప్పగింత ఒప్పందం ప్రకారం.. యూఏఈ న్యాయ మంత్రి తీర్మానం మేరకు నిందితుడిని సంబంధిత అధికారులకు అప్పగించారు. యూఏఈ డిసెంబర్ 2021లో బెల్జియం రాజ్యంతో అప్పగింత ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ఒప్పందం అధికారికంగా నవంబర్ 2022లో అమల్లోకి వచ్చింది. వ్యవస్థీకృత నేరాలు, మనీలాండరింగ్, ఉగ్రవాదానికి ఆర్థిక సహాయం, మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు సంబంధించిన ప్రమాదకరమైన ప్రపంచ నేరాలను ఎదుర్కోవడానికి ఇలాంటి ఒప్పందాలు దోహదం చేస్తాయని యూఏఈ లా మినిస్ట్రీ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









