హత్యా నేరం మోపబడిన వ్యక్తిని బెల్జియంకు అప్పగించిన యూఏఈ
- December 30, 2023
యూఏఈ: నేరగాళ్ల అప్పగింత అభ్యర్థనను అనుసరించి 2023 డిసెంబర్ 29న బెల్జియం అధికారులకు హత్య నేరం మోపబడిన అల్బేనియన్ జాతీయుడైన గెర్గెలీ ఫ్రాంక్ను యూఏఈ అప్పగించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బెల్జియం రాజ్యం సంతకం చేసిన అప్పగింత ఒప్పందం ప్రకారం.. యూఏఈ న్యాయ మంత్రి తీర్మానం మేరకు నిందితుడిని సంబంధిత అధికారులకు అప్పగించారు. యూఏఈ డిసెంబర్ 2021లో బెల్జియం రాజ్యంతో అప్పగింత ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ఒప్పందం అధికారికంగా నవంబర్ 2022లో అమల్లోకి వచ్చింది. వ్యవస్థీకృత నేరాలు, మనీలాండరింగ్, ఉగ్రవాదానికి ఆర్థిక సహాయం, మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు సంబంధించిన ప్రమాదకరమైన ప్రపంచ నేరాలను ఎదుర్కోవడానికి ఇలాంటి ఒప్పందాలు దోహదం చేస్తాయని యూఏఈ లా మినిస్ట్రీ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఖతార్లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు
- హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు..
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!







