శ్రీవారి సుప్రభాత సేవ పునః ప్రారంభ సేవ తేదీని వెల్లడించిన TTD
- December 31, 2023
తిరుమల: ప్రఖ్యాత పుణక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠ ద్వార దర్శనం నేటితో ముగియనుండటం, కొత్త సంవత్సరం ప్రారంభం కావడంతో శ్రీవారిని దర్శంచుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకుంటోన్నారు.కంపార్ట్మెంట్లన్నీ కిటకిటలాడుతున్నాయి.
జనవరి నెల మొత్తం మీద నిర్వహించే విశేష ఉత్సవాలు, ప్రత్యేక పర్వదినాల జాబితాను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు విడుదల చేశారు. శ్రీవారి ఆలయంలో నిర్వహించే పెద్దశాత్తుమొరతో ఇవి ఆరంభం అయ్యాయి. వైకుంఠ ద్వార దర్శనం ఈ అర్ధరాత్రి 12 గంటలకు ముగుస్తుంది.
5వ తేదీన శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ముగుస్తాయి. 6న తిరుమల శ్రీవారు తిరుమలనంబి సన్నిధికి వేంచేపు చేస్తారు. 7వ తేదీన సర్వ ఏకాదశి. ఈ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించడానికి టీటీడీ అధికారులు సన్నాహాలు చేస్తోన్నారు. 9వ తేదీన తొండరడిప్పొడియాళ్వార్ వర్షతిరునక్షత్రం కార్యక్రమాన్ని చేపడతారు.
14వ తేదీన భోగిపండుగ. అదే రోజున ధనుర్మాసం ముగుస్తుంది. 15వ తేదీన మకర సంక్రాంతి. వేడుకలను నిర్వహిస్తారు అధికారులు. ఈ సందర్బంగా శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవను పునఃప్రారంభిస్తారు. కనుమ పండుగ ఉత్సవాల సందర్భంగా 16న తిరుమల శ్రీవారు పార్వేట మండపానికి వేంచేపు చేస్తారు.
25వ తేదీన శ్రీరామకృష్ణతీర్థ ముక్కోటి పర్వదినాన్ని టీటీడీ అధికారులు నిర్వహించనున్నారు. 28న తిరుమొళిశైయాళ్వార్ వర్షతిరునక్షత్రం. 31న కూరత్తాళ్వార్ వర్షతిరునక్షత్రం వేడుకలతో ఈ విశేష ఉత్సవాలు ముగుస్తాయి.
తాజా వార్తలు
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత







