కార్మిక మంత్రిత్వ శాఖ కాల్ సెంటర్ తాత్కాలికంగా సస్పెండ్

- December 31, 2023 , by Maagulf
కార్మిక మంత్రిత్వ శాఖ కాల్ సెంటర్ తాత్కాలికంగా సస్పెండ్

మస్కట్: సిస్టమ్ నిర్వహణ కారణంగా డిసెంబర్ 31 నుండి రెండు రోజుల పాటు కాల్ సెంటర్ సేవలను నిలిపివేస్తున్నట్లు కార్మిక మంత్రిత్వ శాఖ (MOL) ప్రకటించింది. సిస్టమ్ నిర్వహణ కారణంగా ఆదివారం, సోమవారాల్లో కాల్ సెంటర్‌ సేవలు అందుబాటులో ఉండవని,  అంతరాయానికి కార్మిక మంత్రిత్వ శాఖ క్షమాపణలు తెలియజేసింది. సాధారణ సేవలు జనవరి 2, 2024న పునఃప్రారంభం అవుతాయని తెలిపింది. అయితే, తమ సోషల్ మీడియా ఖాతాలలో..  సేవా ఛానెల్‌ల ద్వారా విచారణలను స్వీకరిస్తామని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com