అయోధ్యలో 'బాల రాముడు' విగ్రహం ఎంపిక..
- January 02, 2024
అయోధ్య: ఉత్తర్ప్రదేశ్లోని అయోధ్యలో రామమందిరం మరి కొన్ని రోజుల్లోనే భక్తులకు అందుబాటులోకి రానుంది. ఈ క్రమంలోనే గర్భగుడిలో ప్రతిష్ఠించే విగ్రహం ఏవిధంగా ఉంటుందన్న విషయంపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది.
మూడు విగ్రహాలను సిద్ధం చేయగా.. అందులో కర్ణాటకకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ రూపొందించిన విగ్రహాన్ని ప్రధాన ఆలయంలో ప్రతిష్ఠించనున్నట్లు మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప వెల్లడించారు. రాష్ట్రంలోని రామభక్తుల ఆనందాన్ని ఇది రెట్టింపు చేసినట్లు ట్వీట్ చేశారు.
అయోధ్యలో నిర్మిస్తున్న రామాలయం గర్భగుడిలో 51 అంగుళాల ఎత్తుతో బాల రాముడి విగ్రహం ప్రతిష్ఠించనున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ఇదివరకే వెల్లడించింది. ఇందుకోసం మూడు విగ్రహాలను తయారు చేయించింది. వీటిలో ఒకదాన్ని ఎంపిక చేసేందుకు ఇటీవల బోర్డు సమావేశంలో ఓటింగ్ నిర్వహించింది. రామాలయ గర్భగుడిలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు జనవరి 16 నుంచే మొదలుకానున్నాయి. 17న బాల రాముడి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకువస్తారు. 22న మధ్యాహ్నం 12.20 గంటలకు ప్రాణ ప్రతిష్ఠ నిర్వహించనున్నట్లు ట్రస్టు కార్యదర్శి చంపత్రాయ్ వెల్లడించారు.
తాజా వార్తలు
- బాసర ఆలయాభివృద్ధి పనులకు సీఎం రేవంత్ భూమిపూజ |
- ఖతార్ ప్రధానికి భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఫోన్
- ఏప్రిల్ 10 నుంచి యూపీఐ తప్పనిసరి
- తారామతి బారాదరిలో ‘మోర్ దేన్ ఫ్రెండ్స్’ పార్టీ పై ఈగల్ పోలీసుల దాడులు
- భారత్-ఇజ్రాయెల్ విమాన సర్వీసుల నిలిపివేత
- సెయింట్ లూయిస్ ఫుడ్ బ్యాంక్లో ‘NATS’ సేవలు
- మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్ఓపి హెచ్చరిక..!!
- Metrash ద్వారా రెసిడెన్స్ పర్మిట్ పునరుద్ధరించే విధానం..!!
- డ్రోన్ దాడిలో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించిన ఆర్థిక మంత్రి..!!
- భారీ బడ్జెట్ తో స్మార్ట్ క్లాస్రూమ్ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన ISB..!!









