రేస్లోంచి తప్పుకున్న మాస్ రాజా.!
- January 05, 2024
సంక్రాంతి రేస్లో ఈ సారి ఐదు సినిమాలు పోటీలో వున్న సంగతి తెలిసిందే. అందులో స్టార్ హీరోలు మహేష్ బాబు, నాగార్జున, వెంకటేష్ వున్నారు. వారితో పాటూ, మాస్ రాజా రవితేజ కూడా ‘ఈగల్’ సినిమాతో సిద్ధమయ్యారు. అయితే, నిర్మాతల మండలి చర్చోపచర్చల తర్వాత మాస్ రాజా వెనక్కి తగ్గిపోయారు.
‘ఈగల్’ నిర్మాత తన సినిమాని ఫిబ్రవరికి వాయిదా వేసుకున్నారు. ఫిబ్రవరి 9న సోలోగా ‘ఈగల్’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
పెద్ద హీరోల సినిమాలున్నప్పుడు ఖచ్చితంగా ధియేటర్ల సమస్య తలెత్తుతుంది. ఆ యాంగిల్లోనే ముగ్గురు పెద్ద హీరోలకూ ధియేటర్ల పంపకం జరిగింది. దాంతో, రవితేజ సినిమాని ఫిబ్రవరికి వాయిదా వేసుకున్నారు.
ఈ మధ్య అసలే మాస్ రాజా సినిమాలకు సరైన ఓపెనింగ్సే రావడం లేదు. అలాంటిది, ఇంత పోటీ మధ్య రావడం సబబు కాదనుకున్నారో ఏమో.! తమంతట తాముగా రేస్ నుంచి తప్పుకోవడం జరిగింది.
‘మారింది తేదీ మాత్రమే.. మాసోడి మార్కు కాదు.. ఇండస్ర్టీ బాగు కోసం.. ఓ మంచి సినిమాని జనాలకి ఎక్కువ ధియేటర్లలో అందుబాటులో వుంచడం కోసమే ఈ మార్పు..’ అని తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ ద్వారా సినిమా వాయిదాని ‘ఈగల్’ నిర్మాత ప్రకటించారు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు ఇండియన్ రైల్వే గుడ్ న్యూస్
- తమిళనాడు ప్రధాన కార్యదర్శిగా ఎం.సాయి కుమార్ బాధ్యతలు స్వీకారం
- టీవీ యూజర్లకు బిగ్ షాక్ ఇచ్చిన యూట్యూబ్
- కువైట్ లో విషాదం..రోడ్డు పై 5 మంది మృతి!!
- ప్రయాణికులకు ఊరట.. గల్ఫ్ ఎయిర్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- కువైట్ కాన్సులేట్ పై జరిగిన దాడిని ఖండించిన ఒమన్..!!
- పౌల్ట్రీ ఉత్పత్తుల ఆందోళనపై సౌదీ అరేబియా క్లారిటీ..!!
- ఖతార్ రియల్ దూకుడు.. సైలెంట్ మంత్ లోను వృద్ధి నమోదు..!!
- కాల్పుల విరమణ.. యూఏఈ ట్రావెల్ ఏజెన్సీలకు భారీగా పెరిగిన విచారణలు..!!
- లెబనాన్ పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం...









