‘యాత్ర 2’ స్కెచ్ అదేనా.?
- January 05, 2024
రాజశేఖర్ రెడ్డి బయోపిక్గా తెరకెక్కిన ‘యాత్ర’ సినిమా గతంలో ఓ మోస్తరు విజయం అందుకుంది. విజయం సంగతెలా వున్నా.. ఈ సినిమా గురించీ, ఆ డైరెక్టర్ గురించి ఎక్కువగా మాట్లాడుకున్నారు.
ఆయన మరెవరో కాదు.. మహి. వి. రాఘవ. రాజశేఖర్ రెడ్డి పాద యాత్ర నేపథ్యాన్ని కథా వస్తువుగా తీసుకుని ఈ సినిమాని తెరకెక్కించారాయన. మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి ఈ సినిమాలో లీడ్ రోల్ పోషించారు.
కాగా, ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ వస్తోంది. అదే ‘యాత్ర 2’. ఈ సినిమాకి సంబంధించి లేటెస్ట్గా రిలీజ్ చేసిన పోస్టర్లో తండ్రితో పాటూ తనయుడు జగన్ మోహన్ రెడ్డి కూడా కనిపిస్తున్నాడు. ఠీవీగా రాజశేఖర్ రెడ్డి కుర్చీలో కూర్చుంటే, ఆయన పక్కనే తనయుడు జగన్ మోహన్ రెడ్డి నిలుచుని కనిపిస్తున్నాడు.
త్వరలోనే ఎలక్షన్స్ వున్న నేపథ్యంలో ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మొన్న ఇదే కాన్సెప్ట్తో ప్రస్తుత రాజకీయాల కథా వస్తువుగా తెరకెక్కిన ‘వ్యూహం’ సినిమా రిలీజ్ బెడిసి కొట్టింది. ‘యాత్ర 2’ను ఎలాగైనా ఎలక్షన్స్ దగ్గర చేసి రిలీజ్ చేయాలనుకుంటున్నారు. మరి, ఈ వ్యూహమైనా ఫలిస్తుందో లేదో చూడాలిక.
తాజా వార్తలు
- తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా ఎం.సాయి కుమార్ బాధ్యతలు స్వీకారం
- టీవీ యూజర్లకు బిగ్ షాక్ ఇచ్చిన యూట్యూబ్
- కువైట్ లో విషాదం..రోడ్డు పై 5 మంది మృతి!!
- ప్రయాణికులకు ఊరట.. గల్ఫ్ ఎయిర్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- కువైట్ కాన్సులేట్ పై జరిగిన దాడిని ఖండించిన ఒమన్..!!
- పౌల్ట్రీ ఉత్పత్తుల ఆందోళనపై సౌదీ అరేబియా క్లారిటీ..!!
- ఖతార్ రియల్ దూకుడు.. సైలెంట్ మంత్ లోను వృద్ధి నమోదు..!!
- కాల్పుల విరమణ.. యూఏఈ ట్రావెల్ ఏజెన్సీలకు భారీగా పెరిగిన విచారణలు..!!
- లెబనాన్ పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం...
- ఇరాన్ సంచలన నిర్ణయం









