తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్ జూన్ 1 నుంచి
- May 29, 2016
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. ఈ మేరకు జూన్ 1 నుంచి 5వ తేదీ వరకు నెక్లెస్రోడ్లోని పీపుల్స్ ప్లాజాలో 25 హోటళ్ల స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ స్టాళ్లలో సకినాలు, గారెలు, సంగటి, బిర్యానీ, హలీమ్ తదితర తెలంగాణ వంటకాలు కొలువుదీరనున్నాయని రాష్ట్ర పర్యాటక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. తాజ్ ఫలక్నుమా, తాజ్ కృష్ణ, తాజ్ బంజారా, వివంటా తాజ్, తాజ్ డక్కన్, మినర్వా గ్రాండ్, లెమన్ ట్రీ, ఎల్లా హోటల్స్, రాయల్ రీవ్, అలంకృత రిసార్ట్స్, ఆదిత్య పార్క్, హోటల్ బసెరా, ఓహ్రీ బంజారా, ఓహ్రీ 70 ఎంఎం, ఓహ్రీ నౌటంకీ, మ్యారియెట్, దస్పల్లా, ది ప్లాజా, మ్యారిగోల్డ్, ఆవాస్, గ్రీన్పార్క్, సెంట్రల్ కోర్ట్, పార్క్ హయత్ వంటి ప్రముఖ హోటళ్ల ఆధ్వర్యంలో ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
తాజా వార్తలు
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!







