డా.వంశీ రామరాజుకు పూర్ణకుంభ తెలుగు వెలుగు పురస్కారం....

- January 06, 2024 , by Maagulf
డా.వంశీ రామరాజుకు పూర్ణకుంభ తెలుగు వెలుగు పురస్కారం....

అమరావతి: చైతన్య విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో, శ్రీ శ్రీ రాజరాజ నరేంద్రులవారి పట్టాభిషేక సహస్రాబ్ధికి  నీరాజనంగా, రెండవ అంతర్జాతీయ తెలుగు మహాసభలు, 2024 జనవరి 5వ తేదీన, రాజమహేంద్రవరంలో కే.వి.వి.ఎస్.ఎస్ రాజు (చైతన్య విద్యాసంస్థలు), డా.గజల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో అత్యంత అద్భుతమైన రీతిలో నిర్వహించారు.ఆ సందర్భంగా అర్ద శతాబ్ధి సాంస్కృతిక మూర్తి, వంశీ ఇంటర్నేషనల్, వేగేశ్న ఫౌండేషన్ వ్యవస్థాపకులు, కళా బ్రహ్మ, సేవా మహాత్మ, విశ్వ కళా సేవా భూషణ, శిరోమణి, డా వంశీ రామరాజును పూర్ణకుంభ తెలుగు వెలుగు పురస్కారంతో,  జస్టిస్ బి  కృష్ణమోహన్ గారు, ఆంధ్ర ప్రదేశ్ హైకోర్ట్ న్యాయమూర్తి  సత్కరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com