కోస్టల్ టూరిజం లైసెన్సింగ్.. సౌదీ రెడ్ సీ అథారిటీ తనిఖీలు ప్రారంభం
- January 07, 2024
జెడ్డా : కోస్టల్ టూరిజం కార్యకలాపాలకు లైసెన్స్లు జారీ చేసే ప్రక్రియలో భాగంగా సౌదీ ఎర్ర సముద్ర అథారిటీ (SRSA) తనిఖీలను ప్రారంభించింది. ఈ తనిఖీలు జెడ్డా, జజాన్ మరియు అల్ లైత్లలో ప్రారంభమయ్యాయి. ఇది మెరీనా ఆపరేటర్లు, సముద్ర పర్యాటక ఏజెంట్లకు లైసెన్సు ఇవ్వడంలో కీలకమైన దశను సూచిస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ భాగస్వాముల మధ్య సహకార ప్రయత్నాలతో తీరప్రాంత పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు అథారిటీ తెలిపింది. టూరిస్ట్ మెరీనా ఆపరేటర్ల లైసెన్సింగ్ మెరీనా కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి, కస్టమర్ సేవా ప్రమాణాలను మెరుగుపరచడానికి మరియు ఎర్ర సముద్ర తీరం వెంబడి పడవలు, సందర్శకులకు భద్రతను నిర్ధారిస్తుంది. దీనితోపాటు సముద్ర టూరిజం ఏజెంట్ల లైసెన్సింగ్ యాచ్లు, క్రూయిజ్లకు అత్యుత్తమ సేవలను అందించడానికి వారికి అధికారం కల్పిస్తుంది. కొత్త కోస్టల్ టూరిజం లైసెన్సుల విధానం సౌదీ అరేబియా తీర ప్రాంత పర్యాటక అభివృద్ధిలో ఒక చారిత్రాత్మక, వినూత్నమైన దశగా పేర్కొన్నది.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







