‘ఓజీ’ని వాళ్లు వదిలించుకున్నారు.! వీళ్లు పట్టుకున్నారు.!
- January 08, 2024
పవన్ కళ్యాణ్తో సుజిత్ తెరకెక్కిస్తున్న సినిమా ‘ఓజీ’. ఈ సినిమాపై మొదటి నుంచీ అంచనాలు భారీగానే వున్నాయ్. గ్లింప్స్ రిలీజ్ చేశాకా ఆ అంచనాలు మరింత పెరిగిపోయాయ్.
అయితే, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా ఆగిపోయిందన్న ప్రచారం జరుగుతోంది. ఈ సినిమానే కాదు, పవన్ కళ్యాణ్ చేయాల్సిన సినిమాలన్నీ ఆగిపోయాయ్.
ఈ నేపథ్యంలోనే ‘ఓజీ’ని నిర్మాతలు వదిలించేసుకోవాలనుకుంటున్నారట.. అనే కొత్త ప్రచారం తెర పైకి వచ్చింది. ప్రముఖ నిర్మాత డివివి దానయ్య తన హోమ్ బ్యానర్లో ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే, దానయ్య చేతిలోంచి ‘ఓజీ’ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్లు తీసుకున్నారట.. ఆ రకంగా డివివి దానయ్య ఈ సినిమాని వదిలించేసుకున్నారట.. అనేది ప్రచారం తాలూకు సారాంశం.
అయితే, ఈ ప్రచారంపై తాజాగా దానయ్య అండ్ టీమ్ రెస్పాండ్ అయ్యింది. ఈ ప్రచారంలో ఎంత మాత్రమూ నిజం లేదు. ‘ఓజీ సినిమా మాది.. ఎప్పటికీ అది మాదే.. మా నుంచి ఎవ్వరూ తీసుకోలేదు.. మేం వదులుకునే ప్రశక్తే లేదు..’ అని ఆయన సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









