చాలాగ్యాప్ తర్వాత హీరోలిద్దరూ సెట్స్‌పై హంగామా

- May 30, 2016 , by Maagulf
చాలాగ్యాప్ తర్వాత హీరోలిద్దరూ సెట్స్‌పై హంగామా

బాక్సాఫీసు వద్ద సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న హీరో ఒకరైతే.. తన ల్యాండ్‌మార్క్ మూవీ ప్రేక్షకుల్లో చిరస్థాయిగా నిలిచి పోవాలని మరొకరు. ఇంతకీ ఆ హీరోలు ఎవరో ఇప్పటికే అర్థమైవుంటుంది.. ఒకరు పవన్‌కల్యాణ్, మరొకరు చిరంజీవి. వీళ్లు చేయనున్న సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయని పక్కనబెడితే.. ఇరువురు నాలుగైదు రోజుల గ్యాప్‌లో సెట్స్‌పైకి వెళ్లనున్నారు. ఇక ఎస్‌జె సూర్యతో పవన్ చేస్తున్న ఖుషీ-2 మూవీ షూటింగ్ జూన్ 2 నుంచి పొలాచ్చిలో స్టార్ట్ కానుంది. అందుకు సంబంధించి యూనిట్ అక్కడికి చేరుకొని సన్నాహాల్లో నిమగ్నమైంది.మరోవైపు చిరంజీవి నటించనున్న 'కత్తిలాంటోడు' మూవీని జూన్ 6 నుంచి కంటిన్యూగా షెడ్యూల్‌కు ప్లాన్ చేస్తున్నాడు డైరెక్టర్ వీవీ వినాయక్. స్టోరీకి సంబంధించి రచయిత ఇష్యూ ముగిసిపోవడంతో యూనిట్ హ్యాపీగా వుంది. ఇందుకు సంబంధించి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సెట్ వేసినట్టు టాక్. చిరు డ్యూయెల్ రోల్ చేస్తున్నాడట. చిరు పక్కన హీరోయిన్‌గా అనుష్క దాదాపు ఫైనల్ అయినట్టు వార్తలు వెలువడుతున్నాయి. వున్నట్లుండి అన్నదమ్ములు ఒకేసారి సెట్స్‌పైకి వెళ్లడం వెనుక మతలబు ఏంటి? ఒకేసారి సినిమాలు రిలీజ్ అవుతాయా? లేక అన్నదమ్ములకు జూన్ సెంటిమెంటా? జూలై నుంచి ఆషాడం మొదలుకావడంతో సెట్స్‌పైకి వెళ్లడం అంతమంచిది కాదని కొంతమంది ఇచ్చిన సలహా మేరకు ఇలా చేస్తున్నట్లు మెగా క్యాంప్ నుంచి వెలువడుతున్న సమాచారం. మొత్తానికి చాలాగ్యాప్ తర్వాత హీరోలిద్దరూ సెట్స్‌పై హంగామా చేయబోతున్నారన్నమాట.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com