‘హనుమ్యాన్’ని పబ్లిసిటీనే కాపాడాలి.!
- January 09, 2024
సంక్రాంతి పెద్ద సినిమాలతో పాటూ, చిన్న సినిమాగా లార్జ్ స్కేల్తో రిలీజ్ అవుతున్న సినిమా ‘హనుమ్యాన్’. ఈ సినిమాకి చేసిన పబ్లిసిటీ బాగుంది. మెగాస్టర్ చిరంజీవి సపోర్ట్ కూడా ఈ సినిమాకి లభించింది.
అలాగే, ప్రేక్షకుల్లోనూ కంటెంట్ పరంగా పాజిటివిటీ నెలకొంది. ఒక్క షో పడినా చాలు.. టాక్ బయటికి వచ్చేస్తుంది. ధియేటర్ల కొరత వుంటే, ఆ టాకే సినిమాని నెక్స్ట్ లెవల్కి తీసుకెళుతుంది.
ఇదిలా వుంటే, అయోధ్య రామ మందిరం నిర్మాణం, ప్రారంభోత్సవం నేపథ్యంలో ఈ సినిమా కోసం తెగే ప్రతీ టిక్కెట్టు ధర నుంచీ 5 రూపాయల చొప్పున రామ మందిరానికి విరాళంగా ఇవ్వాలని చిత్ర యూనిట్ నిర్ణయం తీసుకుంది.
చిరంజీవినే స్వయంగా ఈ విషయాన్ని చిత్ర యూనిట్ తరపున ప్రకటించారు కూడా. ఇంతే కాదు, బుల్లితెర పైనా ‘హనుమ్యాన్’ సందడి చేయబోతున్నాడు.
ఓ సీరియల్లో ‘హనుమ్యాన్’గా తేజ సజ్జ తన రీల్ లైఫ్ క్యారెక్టర్తో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. దాంతో, ప్రతీ ఇంటింటికీ ‘హనుమ్యాన్’ సినిమా పబ్లిసిటీ జరుగుతుంది.
సో, పబ్లిసిటీ అయితే బాగుంది. ఈ పబ్లిసిటీనే సినిమాని కాపాడాలి. చూద్దాం. ఏం జరుగుతుందో. ‘గుంటూరు కారం’ సినిమాతో పాటూ, జనవరి 12న ‘హనుమ్యాన్’ ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- ఇరాన్ తాజా దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- 70 మంది నర్సులను సత్కరించిన ఇండియన్ లేడీస్ అసోసియేషన్..!!
- కువైట్, బీరుట్ కు సర్వీసులను నిలిపివేసిన సలామ్ ఎయిర్..!!
- వర్క్ ప్లేస్ లో హీట్ స్ట్రెస్ ఎదుర్కోవడానికి MoPH టిప్స్..!!
- తాజా పరిణామాల పై సౌదీ క్రౌన్ ప్రిన్స్, లెబనాన్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- పిల్లల స్పోర్ట్స్ ట్రైనింగ్ పై హీట్ స్ట్రెస్ ఎఫెక్ట్..పేరెంట్స్, డాక్టర్లు ఆందోళన..!!
- తాత్కాలికంగా మూసివేసిన గగనతలాన్ని తిరిగి తెరిచిన కువైట్
- ఢిల్లీ అగ్నిప్రమాదం కేసులో హోటల్ వంటవాడు అరెస్ట్
- NRIలకు శుభవార్త..ఆ రూల్ మార్చేసిన టీటీడీ
- ఢిల్లీలో కాక్రోచ్ పార్టీ నిరసన..పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు









