కాల్షియం సప్లిమెంట్స్ ఎక్కువగా తీసుకుంటే ఏం జరుగుతుంది.?
- January 09, 2024
శరీరానికి సరిపడా కాల్షియం అందకపోతే, కీళ్ల నొప్పులు, ఎముకలు పటుత్వం కోల్పోవడం, దంత సమస్యలు తదితర సమస్యలు వేధిస్తాయ్. అందుకే చాలా మంది కాల్షియం తక్కువగా వుందంటే సప్లిమెంట్స్ వాడుతుంటారు.
ట్యాబ్లెట్ల రూపంలో వాడే సప్లిమెంట్ల ఆరోగ్యానికి మంచిది కాదనీ, వాటితో కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయనీ నిపుణులు చెబుతున్నారు.
ఆహారంలో సహజ సిద్ధంగా తీసుకునే కాల్షియం వల్ల ఎటువంటి నష్టం కలగదు. కానీ, ట్యాబ్లెట్ల రూపంలో తీసుకునే కాల్షియం మూత్ర పిండాల్లోని లవణాలతో కలిసి రాళ్లలాగా మారుతుంది. అవి తర్వాత మూత్రాశయానికి అడ్డంకిగా మారి తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయ్.
అందుకే కాల్షియం సప్లిమెంట్లు ఎలా పడితే అలా వాడరాదని.. నిపుణుల సలహా ప్రకారం మాత్రమే కాల్షియం సప్లిమెంట్లు వాడాలని చెబుతున్నారు.
క్యారెట్, బీట్ రూట్, చేపలు, గుడ్లు వంటి ఆహారంలో కాల్షియం అధికంగా లభిస్తుంది. కాల్షియం అధికంగా వుండే ఆహరం తీసుకోవడం వల్ల అందులోని కాల్షియంని ప్రేగులు గ్రహించి ఆక్సలైట్స్తో కలిపి బంధిస్తాయ్. అందువల్ల రాళ్లు ఏర్పడే అవకాశం తక్కువగా వుంటుంది. సో, కాల్షియం సప్లిమెంట్ల పేరు చెప్పి, ట్యాబ్లెట్లు తీసుకోవడం మంచిది కాదనేది నిపుణులు సలహా.
తాజా వార్తలు
- హైదరాబాద్ విమానాశ్రయంలో అధునాతన ల్యాండింగ్ సదుపాయాలు!
- మీరు పోస్టాఫీసులో రోజుకు రూ.50 పెట్టుబడి పెడితే చాలు..
- యూరోపియన్ నేతల అత్యవసర సమావేశం
- ఏపీలో ప్రజల భద్రత కోసం ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి: డీజీపీ గుప్తా
- కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్
- సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా చర్యలు చేపడుతున్నాం: హోం మంత్రి అనిత
- బుర్జుమాన్ మాల్ లో టిక్కెట్ లెస్ పార్కింగ్ సిస్టమ్..!!
- యూఏఈలో ప్రాథమిక ఉత్పత్తుల ధరల పెంపుపై మంత్రి క్లారిటీ..!!
- నాన్-ఆల్కహాలిక్ ఏల్ దుబాయ్లో ప్రారంభం..!!
- డ్రగ్స్ వినియోగం..మహిళకు పదేళ్ల జైలు శిక్ష, 100,000 దిర్హామ్ జరిమానా..!!