వర్చువల్ రూమ్'తో ఆర్థిక మోసాలకు చెక్!
- January 14, 2024
కువైట్: ఆర్థిక మోసాలను ఎదుర్కోవడానికి వర్చువల్ రూమ్ (అమన్)ను ప్రారంభించినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ (MoI) పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెల్లడించింది. కువైట్ బ్యాంకింగ్ అసోసియేషన్ (KBA) సహకారంతో వర్చువల్ రూమ్ ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇది 24 గంటలు అందుబాటులో ఉంటుందన్నారు. అన్ని స్థానిక బ్యాంకుల నుండి ఆర్థిక మోసాలకు సంబంధించిన ఫిర్యాదులను స్వీకరించడానికి , వాటిపై తక్షణమే స్పందించడానికి ఇది దోహదం చేస్తుందని మంత్రిత్వ శాఖ జనరల్ డైరెక్టరేట్ తెలిపింది. 2023 డిసెంబర్ 7 నుండి జనవరి 9 వరకు “అమన్” ద్వారా దాదాపు 285 ఫిర్యాదులు పరిష్కరించబడ్డాయని వెల్లడించింది. ఈ ఫిర్యాదుల విలువ KD 495.973 (దాదాపు $1.62 మిలియన్లు) అని పేర్కొంది. మోసానికి గురైన వ్యక్తులు ఆలస్యం చేయకుండా ఫిర్యాదును సమర్పించాలని మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్







