వర్చువల్ రూమ్'తో ఆర్థిక మోసాలకు చెక్!
- January 14, 2024
కువైట్: ఆర్థిక మోసాలను ఎదుర్కోవడానికి వర్చువల్ రూమ్ (అమన్)ను ప్రారంభించినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ (MoI) పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెల్లడించింది. కువైట్ బ్యాంకింగ్ అసోసియేషన్ (KBA) సహకారంతో వర్చువల్ రూమ్ ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇది 24 గంటలు అందుబాటులో ఉంటుందన్నారు. అన్ని స్థానిక బ్యాంకుల నుండి ఆర్థిక మోసాలకు సంబంధించిన ఫిర్యాదులను స్వీకరించడానికి , వాటిపై తక్షణమే స్పందించడానికి ఇది దోహదం చేస్తుందని మంత్రిత్వ శాఖ జనరల్ డైరెక్టరేట్ తెలిపింది. 2023 డిసెంబర్ 7 నుండి జనవరి 9 వరకు “అమన్” ద్వారా దాదాపు 285 ఫిర్యాదులు పరిష్కరించబడ్డాయని వెల్లడించింది. ఈ ఫిర్యాదుల విలువ KD 495.973 (దాదాపు $1.62 మిలియన్లు) అని పేర్కొంది. మోసానికి గురైన వ్యక్తులు ఆలస్యం చేయకుండా ఫిర్యాదును సమర్పించాలని మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్బైజాన్లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!









