అరటి పండులోని పోషకాల గురించి తెలిస్తే.!
- January 16, 2024ఆప్ట్రాల్ అరటిపండు.. అనుకుంటాం. ఎందుకంటే పండ్లలో అతి తేలికగా లభించే పండు అరటి పండు. చాలా మంది అరటి పండును లైట్ తీసుకుంటారు. కానీ, అరటి పండులో ఎన్నో పోషకాలున్నాయ్. వాటితో వచ్చే ఆరోగ్య ప్రయోజనాలెన్నో.. ఎన్నెన్నో.!
అవేంటో తెలుసుకుందామా.? అరటి పండులో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ. అందుకే మలబద్దకం వున్నవారికి ఇదో వరంగానే చెప్పొచ్చు. అరటిపండులోని సింథటిక్ లాక్సిటివ్గా పని చేస్తుంది. సో, క్రమం తప్పకుండా అరటి పండు తింటే, మలబద్ధకం అనే సమస్య దరి చేరదు.
అలాగే అజీర్తి సమస్య వున్నవాళ్లకీ అరటి పండు మంచి ఔషధంగా పని చేస్తుంది. అంతేకాదు, అరటి పండులో కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ వంటి మూలకాలు పుష్కలంగా లభిస్తాయ్. శరీరం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి చాలా అవసరం.
అయితే, అరటి పండులో కాలరీలు ఎక్కువగా వుంటాయ్. ఊబకాయం వున్నవాళ్లు కాస్త ఆచి తూచి తినాల్సి వుంటుంది. కేలరీలు అధికంగా వుండడం వల్లనే.. ఎక్కువ ఆకలిగా అనిపించినప్పుడు ఒక్క అరటి పండు తింటే.. కడుపు నిండిపోయిన ఫీలింగ్ వస్తుంది.
అరటి పండులో కార్భోహైడ్రేట్లు కూడా పుష్కలంగా వుండడంతో పాటూ, అంతకు రెండు రెట్లు విటమిన్ ఎ అధికంగా వుంటుంది. రక్తపోటు అదుపులో వుంచేందుకు అరటి పండు ఓ దివ్యౌషధమే అని నిపుణులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ తాత్యాలిక అధ్యక్షుడిగా ముఖ్బీర్..?
- దుబాయ్ లో సైకిళ్లు, స్కూటర్ల కోసం మల్టీయూజ్ ట్రాక్
- సౌత్ అల్ బతినా గవర్నరేట్లో అగ్నిప్రమాదం
- కింగ్ సల్మాన్ కు వైద్య పరీక్షలు
- నకిలీ వర్క్ పర్మిట్లు సేల్..ఇద్దరు అరెస్ట్
- మారిటైమ్ సేఫ్టీ నినాదంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
- ఇరాన్ అధ్యక్షుడు రైసీహెలికాప్టర్ ప్రమాదంలో మృతి..!
- యూఏఈ ప్రయాణ వ్యాక్సిన్లు: అవసరమైన జాబ్లు, ఖర్చులు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు