కొత్త సాలిక్ టోల్ గేట్లు.. 42% తగ్గనున్న దుబాయ్ ట్రాఫిక్!
- January 21, 2024
యూఏఈ: దుబాయ్ లోని అల్ ఖైల్ రోడ్లోని బిజినెస్ బే క్రాసింగ్లో, అల్ సఫా సౌత్లోని షేక్ జాయెద్ రోడ్లోని అల్ మైదాన్ స్ట్రీట్ మరియు ఉమ్ అల్ షీఫ్ స్ట్రీట్ మధ్య కొత్తగా రెండు సాలిక్ టోల్ గేట్లను ఏర్పాటు చేయనున్నట్లు శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే. రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) ప్రకారం.. కొత్త టోల్ గేట్లు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్, దుబాయ్ - అల్ ఐన్ రోడ్, రస్ అల్ ఖోర్ రోడ్ మరియు అల్ మనామా స్ట్రీట్ వంటి ప్రత్యామ్నాయ ట్రాఫిక్ కారిడార్లకు మళ్లించడం ద్వారా దుబాయ్ రోడ్లపై ట్రాఫిక్ ప్రవాహాలను క్రమబద్ధీకరిస్తాయి. జెబెల్ అలీ నుండి షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ మరియు ఎమిరేట్స్ రోడ్లకు ట్రాఫిక్ను మళ్లించడం ద్వారా అల్ ఖైల్ రోడ్ రద్దీని 15 శాతం వరకు తగ్గిస్తుంది. అల్ రెబాట్ స్ట్రీట్ యొక్క ట్రాఫిక్ వాల్యూమ్లను 16 శాతం వరకు తగ్గిస్తుంది. ఫైనాన్షియల్ సెంటర్ స్ట్రీట్ ట్రాఫిక్ వాల్యూమ్లను 5 శాతం తగ్గించారు. అల్ ఖైల్ రోడ్ అల్ రెబాట్ మరియు రస్ అల్ ఖోర్ స్ట్రీట్ల మధ్య రద్దీగా ఉండే సెగ్మెంట్లో రెండు దిశలలో ప్రతిరోజూ 20,000 గంటల ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుంది. షేక్ జాయెద్ రోడ్ నుండి అల్ మైదాన్ స్ట్రీట్ వరకు రైట్ టర్నింగ్ ట్రాఫిక్ 15 శాతం తగ్గుతుంది. అల్ మైదాన్ మరియు అల్ సఫా స్ట్రీట్స్ నుండి షేక్ జాయెద్ రోడ్ వరకు 42 శాతం ట్రాఫిక్ పరిమాణాన్ని తగ్గుతుంది. ఫైనాన్షియల్ సెంటర్ మరియు లతీఫా బింట్ హమ్దాన్ స్ట్రీట్స్ మధ్య షేక్ జాయెద్ రోడ్లో ట్రాఫిక్ వాల్యూమ్లను 4 శాతం తగ్గుతుంది. ఫస్ట్ అల్ ఖైల్ రోడ్ మరియు అల్ అసాయెల్ స్ట్రీట్స్ వినియోగాన్ని 4 శాతం ఆప్టిమైజ్ చేస్తుందని RTA డైరెక్టర్ జనరల్, బోర్డ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ చైర్మన్ మత్తర్ అల్ తాయర్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న టోల్ గేట్లు దుబాయ్లో సంవత్సరానికి 6 మిలియన్ గంటల ప్రయాణ సమయాన్ని తగ్గించడానికి దోహదపడ్డాయని, అల్ మక్తూమ్ మరియు అల్ గర్హౌద్ వంతెనలపై ట్రాఫిక్ వాల్యూమ్లు 26 శాతం తగ్గాయని, షేక్ జాయెద్ రోడ్ మరియు అల్ ఇత్తిహాద్ స్ట్రీట్లలో ప్రయాణ సమయాన్ని 24 శాతం తగ్గించాయన్నారు. దీంతో మాస్ ట్రాన్సిట్ వినియోగదారుల సంఖ్యను సంవత్సరానికి 9 మిలియన్ల రైడర్లు పెరిగారని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు