అబుదాబిలో మరణ ధృవీకరణ పత్రం, ఖనన విధానాలు సరళీకృతం
- January 21, 2024
యూఏఈ: అబుదాబిలో ఏడు ప్రభుత్వ సంస్థల సేవలను డిజిటల్గా మార్చింది. దీంతో మరణ ధృవీకరణ పత్రాన్ని పొందడం, ఖననం కోసం ఏర్పాటు చేయడంతో సహా మరణించిన కుటుంబాల కోసం విధానాలను సులభతరం చేయనుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ - అబుదాబి (DoH) సనద్కోమ్ ఈ చొరవను ఆవిష్కరించింది.ఇది అబుదాబి ప్రోగ్రామ్ ఫర్ ఎఫర్ట్లెస్ కస్టమర్ ఎక్స్పీరియన్స్లో భాగంగా తీసుకొచ్చారు. మొదటి దశలో మరణించిన యూఏఈ జాతీయుల కుటుంబాలకు సేవలను అందిస్తుంది. తరువాతి దశలో ఇది ఎమిరేట్లోని నివాసితులందరినీ సేవలను విస్తరిస్తుందని DoH అండర్ సెక్రటరీ డాక్టర్ నౌరా ఖమీస్ అల్ ఘైతి తెలిపారు. ఏ ప్రభుత్వ విభాగాన్ని సందర్శించాల్సిన అవసరం లేకుండా అన్ని సేవలను అందించేలా ఫోన్ ద్వారా ఒక్కో కేసు ఆధారంగా మృతుల కుటుంబాలకు మద్దతు, సహాయాన్ని అందించడానికి ఉమ్మడి ప్రభుత్వ సహాయక బృందాన్ని నియమించనున్నట్లు తెలిపారు. ఇది మరణ ధృవీకరణ పత్రాన్ని పొందడం, మరణించిన వ్యక్తి ఖననం, బీమా చేసిన లేదా వారి తరపున లబ్ధిదారులకు పదవీ విరమణ పెన్షన్ ప్రయోజనాలను పంపిణీ చేయడం వంటి అవసరమైన అన్ని మరణ సంబంధిత లావాదేవీలను పూర్తి చేయడంలో కుటుంబాలకు అన్ని విధాలుగా మద్దతుగా ఉంటూ సహాయాన్ని అందిజేస్తారని వివరించారు.
తాజా వార్తలు
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..