ఎయిరిండియాలోకి కొత్త ఎయిర్బస్ ఎ350-900
- January 22, 2024న్యూఢిల్లీ: ఎయిరిండియా కొత్తగా కొనుగోలు చేసిన ఎయిర్బస్ ఎ350-900 వాణిజ్య సేవలను ప్రారంభించింది. ఈ విమానాన్ని దేశంలోనే తొలిసారి ఎయిరిండియా ప్రవేశపెట్టింది.
హైదరాబాద్లో జరిగిన వింగ్స్ ఇండియా -2024లోనూ ప్రదర్శించింది. దీంతో సోమవారం బెంగళూరు, ముంబయిల మధ్య సేవలను ప్రారంభించింది. ఎఐ589 ప్లయిట్ నెంబర్తో బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఉదయం 7.05 గంటలకు ప్రారంభమై.. 8.50 గంటలకు ముంబయికి చేరుకుంది. తదుపరి దశల్లో చెన్నరు, ముంబయి, హైదరాబాద్ సేవలకు ఉపయోగించనుంది. డిజిసిఎ అనుమతుల తర్వాత తదుపరి అంతర్జాతీయ సర్వీసులకు వినియోగించనుంది. ఇందులో 28 ప్రయివేటు బిజినెస్ సూట్లు సహా మొత్తం 350 సీట్లు ఉన్నాయి. ఈ విమానంతో 20 శాతం ఇంధనం ఆదా కానుందని ఇటీవల ఎయిర్బస్ వెల్లడించింది.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్
- సోదరుడిని కత్తితో చంపిన యువకుడికి 15ఏళ్ల జైలుశిక్ష
- దుబాయ్ టాక్సీలో వస్తువులు మర్చిపోతే ఏం చేయాలి?
- ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్..
- ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులు రద్దు
- వేములవాడ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన