గర్భిణీ స్త్రీల డైట్లో ఖచ్చితంగా వుండాల్సిందేంటంటే.!
- January 22, 2024
పండంటి బిడ్డకు జన్మనివ్వాలంటే.. అందుకు తగ్గట్లుగా గర్భిణి స్త్రీలు పోషకాలున్న ఆహారం తీసుకోవాలి. వైద్యులు సూచించే మందులతో పాటూ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే, తల్లితో పాటూ, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం కూడా బావుంటుంది.
ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు తీసుకునే ఆహారంలో జింక్ శాతం సరిపడా స్థాయిలో వుండాలి. కణ విభజన, ప్రొటీన్ సంశ్లేషణ సహా పిండం పెరుగుదలలో జింక్ కీలక పాత్ర పోషిస్తుంది.
అందుకే గర్భిణీలు రోజుకు కనీసం 12mg మోతాదులో జింక్ కంటెంట్ తమ ఆహారంలో వుండేలా చూసుకోవాలి. మరి, జింక్ పుష్కలంగా లభించే ఆహార పదార్ధాలేంటీ.? ఇప్పుడు తెలుసుకుందాం.
తోటకూరలో ఫైబర్, ప్రోటీన్స్తో పాటూ, మెగ్నీషియం, మాంగనీస్, ఐరన్, జింక్ కూడా పుష్కలంగా వుంటుంది. అలాగే, బాదం పప్పులోనూ జింక్ లభిస్తుంది. నానబెట్టిన బాదం పప్పులు గర్భిణీ స్ర్తీలు చిరు తిండిలో భాగంగా చేసుకుంటే మంచిది.
నువ్వుల్లో కాల్షియం, ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. దాంతో పాటూ జింక్ కూడా తగిన మోతాదులో వుంటుంది. ప్రతీరోజూ గర్భిణులు బెల్లం కలిపిన నువ్వుల లడ్డును తింటే చాలా మంచిది. దీనితో పాటూ, పల్లీలు కూడా గర్భిణీ స్ర్తీలకు చాలా చాలా మంచి ఆహారం.
వాస్తవంగా చెప్పాలంటే.. శరీరంలోని ఎంజైమ్స్ అన్నీ సక్రమంగా పని చేయాలంటే జింక్ అవసరం తప్పనిసరి. సో, జింక్ లభించే ఆహార పదార్ధాలను అందరూ తప్పకుండా తమ డైట్లో చేర్చుకోవాల్సిందే.
తాజా వార్తలు
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్లో హెచ్చరిక సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం







