పసుపు ఉత్పత్తిలో ధోఫర్ సక్సెస్
- January 23, 2024
రఖ్యూత్: దోఫార్ గవర్నరేట్లోని నాలుగు విలాయత్లలో పసుపును పెంచే ప్రాజెక్ట్ వరుసగా మూడో సంవత్సరం సక్సెస్ అయింది. ధాల్కుట్, రఖ్యూత్, సలాలా మరియు టాకాలోని విలాయత్లలోని నిర్దిష్ట ప్రాంతాలలో పసుపును పండించడానికి వ్యవసాయ మరియు మత్స్య అభివృద్ధి నిధి ద్వారా నిధులు సమకూరుస్తున్నాయి. ఈ విజయం ధోఫర్ గవర్నరేట్లోని రైతులను పసుపు ఉత్పత్తిని పెంచడానికి ప్రోత్సహించింది. లబ్ధిదారుల్లో ఒకరైన అర్వా అకాక్ మాట్లాడుతూ.. తాము 2022లో పసుపు సాగు చేయడం ప్రారంభించామని తెలిపారు. పసుపును పండించడానికి బంకమట్టి నేల అవసరమని, వార్షిక సగటు ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ మరియు 35 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటుందని చెప్పారు. పసుపును పండించడం వల్ల దిగుమతులు తగ్గుతాయని, పౌరులకు ఉద్యోగావకాశాలు ఏర్పడతాయని, స్థానిక ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి దోహదం చేస్తుందని అధికార వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- భారత్-ఇజ్రాయెల్ విమాన సర్వీసుల నిలిపివేత
- సెయింట్ లూయిస్ ఫుడ్ బ్యాంక్లో ‘NATS’ సేవలు
- మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్ఓపి హెచ్చరిక..!!
- Metrash ద్వారా రెసిడెన్స్ పర్మిట్ పునరుద్ధరించే విధానం..!!
- డ్రోన్ దాడిలో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించిన ఆర్థిక మంత్రి..!!
- భారీ బడ్జెట్ తో స్మార్ట్ క్లాస్రూమ్ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన ISB..!!
- అరఫా డే, ఈద్ అల్ అదా..లాంగెస్ట్ పబ్లిక్ హాలీడే..!!
- సౌదీ అరేబియాలో పలు ప్రాంతాలలో భారీ వర్షాలు..!!
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్









