మస్కట్లోని భారత రాయబార కార్యాలయంలో ఘనంగా ITEC దినోత్సవం
- January 24, 2024
మస్కట్: మస్కట్లోని భారత రాయబార కార్యాలయం జనవరి 18వ తేదీన ఎంబసీ ప్రాంగణంలో 'ఇండియన్ టెక్నికల్ & ఎకనామిక్ కోఆపరేషన్' (ITEC) దినోత్సవాన్ని జరుపుకుంది. 'ఒమన్ విజన్ 2040' లక్ష్యాలను సాధించడానికి ఒమన్ ప్రయాణంలో భారత ప్రభుత్వం బలమైన భాగస్వామి అని ఈ సంధర్భంగా వక్తలు చెప్పారు. దీని కోసం భారత ప్రభుత్వం యొక్క ITEC కార్యక్రమం కీలక ఫెసిలిటేటర్గా ఉంటుందన్నారు. ప్రత్యేక శిక్షణ, మానవ వనరుల అభివృద్ధి మరియు నైపుణ్యాభివృద్ధి ఈ ప్రయాణంలో అంతర్భాగం, దీనికి ITEC ఒక ఆదర్శ వేదిక అని పేర్కొన్నారు. ఒమానీ అభ్యర్థులకు వారి ఆసక్తి ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక కస్టమైజ్డ్ కోర్సులను నిర్వహించవచ్చని వారు హామీ ఇచ్చారు. ITEC కోర్సుల యొక్క ప్రయోజనాల గురించి వివరిస్తూ విజ్ఞానం మరియు నైపుణ్యాన్ని అందించడమే కాకుండా ఇతర దేశాల నుండి శిక్షణ పొందే వారితో భారతదేశం మరియు దాని సంస్కృతి, సంప్రదాయాల గురించి మరింత తెలుసుకోవడానికి వారికి అవకాశం కల్పిస్తుందన్నారు. ఈ సందర్భంగా ప్రతిభావంతులైన కళాకారిణి జుంపా చక్రవర్తి, ఆమె విద్యార్థులు కథక్ నృత్య ప్రదర్శనను ప్రదర్శించారు.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







