మస్కట్లో ఘనంగా 75వ భారత గణతంత్ర దినోత్సవం
- January 26, 2024
మస్కట్: మస్కట్లోని భారత రాయబార కార్యాలయం 75వ గణతంత్ర దినోత్సవాన్ని జనవరి 26న ఉదయం ఘనగా జరుపుకుంది. ఒమన్ సుల్తానేట్లో భారత రాయబారి అమిత్ నారంగ్ తోపాటు 500 మందికి పైగా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. రాయబారి అమిత్ నారంగ్, అతని భార్య దివ్య నారంగ్ ఎంబసీలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఇండియన్ స్కూల్ బౌషర్ విద్యార్థులు జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి భారత రాష్ట్రపతి చేసిన ప్రసంగంలోని సారాంశాలను రాయబారి చదివి వినిపించారు. ఇండియన్ స్కూల్ బౌషర్ విద్యార్థులు రెండు దేశభక్తి గీతాలను ప్రదర్శించడంతో కార్యక్రమం ముగిసింది. గణతంత్ర దినోత్సవ వేడుకల కొనసాగింపుగా.. జనవరి 28న సాయంత్రం ఎంబసీ ద్వారా గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించనున్నారు.
తాజా వార్తలు
- భారత్-ఇజ్రాయెల్ విమాన సర్వీసుల నిలిపివేత
- సెయింట్ లూయిస్ ఫుడ్ బ్యాంక్లో ‘NATS’ సేవలు
- మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్ఓపి హెచ్చరిక..!!
- Metrash ద్వారా రెసిడెన్స్ పర్మిట్ పునరుద్ధరించే విధానం..!!
- డ్రోన్ దాడిలో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించిన ఆర్థిక మంత్రి..!!
- భారీ బడ్జెట్ తో స్మార్ట్ క్లాస్రూమ్ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన ISB..!!
- అరఫా డే, ఈద్ అల్ అదా..లాంగెస్ట్ పబ్లిక్ హాలీడే..!!
- సౌదీ అరేబియాలో పలు ప్రాంతాలలో భారీ వర్షాలు..!!
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్









