ఫిబ్రవరి 5 నుండి 11 వరకు దోహా జ్యువెలరీ అండ్ వాచెస్ ఎగ్జిబిషన్
- January 29, 2024
దోహా: ఖతార్ యొక్క గొప్ప సంస్కృతి, వారసత్వాన్ని తెలియజేసేలా ఫిబ్రవరి 5 నుండి 11 వరకు దోహా జ్యువెలరీ అండ్ వాచెస్ ఎగ్జిబిషన్ (DJWE) 20వ ఎడిషన్ ను నిర్వహించనున్నారు. ఇందులో 10 మంది ఖతారీ డిజైనర్ల ప్రతిభను ప్రదర్శించనున్నారు. వారి కళాఖండాలలో బట్టోలా, సాంప్రదాయ ఫ్యాషన్ మాస్క్, రాబోయే రమదాన్ కోసం రూపొందించిన పూసల ఆభరణాలు, అద్భుతమైన ఖతార్ మ్యాప్ ఆకారపు నెక్లెస్ లు ఉన్నాయి. ఖతారీ డిజైన్లకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. పెవిలియన్లో హెస్సా జ్యువెల్స్, అల్ ఘ్లా జ్యువెలరీ, డి ట్రోవ్, ఘండ్ జ్యువెలరీ, హెచ్ జ్యువెలరీ, కల్తామ్ యొక్క ఫైన్ జ్యువెలరీ, మిడాద్ జ్యువెలరీ, నౌఫ్ జ్యువెలరీ, థమీన్ జ్యువెలరీ మరియు ట్రిఫోగ్లియో వంటి సంస్థలు ఉన్నాయని ఖతార్ టూరిజం చీఫ్ ఆఫ్ మార్కెటింగ్ అండ్ ప్రమోషన్ ఆఫీసర్ ఇంజినీర్ అబ్దుల్ అజీజ్ అలీ అల్ మావ్లావి తెలిపారు. ఇందులో 10 దేశాల నుండి 500 బ్రాండ్లను కలిగి ఉన్న ఈ ప్రదర్శన DECCలో జరుగుతుంది.
తాజా వార్తలు
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్







