జిల్లాలో నేటి నుంచి పది శాఖల్లో ఈ ఆఫీసు సేవలు
- May 31, 2016
జిల్లాలోని పది శాఖల్లో ఈ ఆఫీస్ సేవలు ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. అన్ని శాఖల్లో జవాబుదారీతనం పెంచేందుకు ఈ విధానం తీసుకొస్తున్నట్లు వారు చెబుతున్నారు. ఎలా పని చేస్తుంది అన్ని కార్యాలయాల్లో ప్రజలు పెట్టుకునే దరఖాస్తులన్నీ స్కానింగ్ చేసి కంప్యూటర్లో ఫీడ్ చేస్తారు. వీటిని సంబంధిత అధికారికి పంపుతారు. ఈ దరఖాస్తు కొన్ని సెకన్లకే సంబంధిత అధికారి ముందుకు వెళుతుంది. అన్ని స్థాయిల్లో ఫైలు ఎవరు ఆలస్యం చేస్తున్నారో స్పష్టంగా గుర్తించవచ్చు. ఆర్టీఏ యాక్ట్ తదితర అదనపు పనులు వేగవంతంగా పూర్తి చేయవచ్చు. దరఖాస్తుల పరిష్కారం ఏ దశల్లో ఉందో ముఖ్యమంత్రి నుంచి అన్ని స్థాయిల అధికారులు తెలుసుకోవచ్చు.జిల్లాలో ఎప్పటి నుంచి.. జిల్లాలో నేటి నుంచి పది శాఖల్లో ఈ ఆఫీసు ప్రారంభించాలని తొలుత జిల్లా అధికారులు భావించారు. కానీ డిజిటల్ సిగ్నేచర్ ఇతర సాంకేతిక కారణాలతో మరో నెల ఆలస్యమయ్యేలా ఉంది.డీఆర్వో నాగబాబు, ఈ ఆఫీస్ జిల్లా కో-ఆర్డి నేటర్ ఇప్పటికే రెవెన్యూలో ఈ ఆఫీస్ ప్రారంభమైంది. దీంతో జిల్లాలో రెవెన్యూ సమస్యల పరిష్కారం వేగవంతమైంది. కొద్ది రోజుల్లో అన్ని ఆటంకాలు అధిగమించి 10 శాఖల్లో ఈ ఆఫీస్ ప్రారంభిస్తాం. ఈ విధానంలో ఏవైనా లోటుపాట్లను మా దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరిస్తాం.
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







