అబుదాబి - అల్ ధన్నా మధ్య ట్రైన్ సర్వీస్ ప్రారంభం!
- February 01, 2024
యూఏఈ: అబుధాబి నగరం, అల్ ధన్నా ప్రాంతం మధ్య రైలు ప్రయాణం అధికారికంగా ప్రారంభమైంది. అబుధాబి నేషనల్ ఆయిల్ కంపెనీ (అడ్నోక్) ఎగ్జిక్యూటివ్ లీడర్షిప్ టీమ్తో పాటు పరిశ్రమ - టెక్నాలజీ మంత్రి డాక్టర్ సుల్తాన్ అహ్మద్ అల్ జాబర్ ప్రారంభ ప్యాసింజర్ రైలులో ప్రయాణించారు. గత ఏడాది నవంబరులో ఎతిహాద్ రైల్ , అబుధాబి నేషనల్ ఆయిల్ కంపెనీ (అడ్నాక్) అబుదాబి - అల్ ధాఫ్రాలోని అల్ ధన్నా మధ్య రైలు సేవలను ఏర్పాటు చేయడానికి ఒప్పందంపై సంతకం చేశాయి. అబుదాబికి పశ్చిమాన 250కిమీ దూరంలో ఉన్న అల్ ధన్నాలో 29వేల మంది నివసిస్తున్నారు. తాజా రైలు మార్గం ద్వారా అడ్నాక్ ఉద్యోగులకు ఇది మేలు చేయనుంది. ఎతిహాద్ ఫోటోలు, వీడియోలను పోస్ట్ చేసింది. 4 బోగీల ప్యాసింజర్ రైలులో మంత్రి, ఉన్నతాధికారులు ప్రయాణించారు. రైలు ప్యాసింజర్ సేవలు అల్ సిలా నుండి ఫుజైరా వరకు 11 నగరాలను కలుపుతాయి. రైళ్లు 200kmph వేగంతో నడుస్తాయి. ఇతర రవాణా మార్గాలతో పోలిస్తే ఇవి ప్రయాణ సమయాన్ని 30-40 శాతం తగ్గిస్తాయి. ప్రయోగ తేదీ ఇంకా ప్రకటించబడలేదు. కానీ 2030 నాటికి ప్రయాణీకుల సంఖ్య ఏటా 36.5 మిలియన్లకు చేరుకుంటుందని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- 14 వేల మందిని ఇంటికి సాగనంపుతున్న అమెజాన్
- ఇరాన్ వీడాలని భారతీయులకు కేంద్రం ఆదేశం..
- ఇరాన్ 10 షరతులు ఇవే..
- వడ్డీరేట్ల పై ఆర్బీఐ కీలక నిర్ణయం..
- టెంపుల్ టూరిజం పై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్
- గాజువాక మౌనిక హత్య కేసులో ట్విస్ట్..
- క్రూడాయిల్ ధరలు ఢమాల్
- సౌదీ అరేబియాలో పెరగనున్న సాధారణ ఉష్ణోగ్రతలు..!!
- KD10 మించిన నగదు లావాదేవీల పై నిషేధం..!!
- వీగిన బహ్రెయిన్ సముద్ర భద్రతా తీర్మానం..రష్యా,చైనా వీటో..!!









