పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం: SR200 మిలియన్ కనీస పెట్టుబడి
- February 05, 2024
రియాద్: సౌదీ అరేబియాలో ప్రైవేటీకరణ చట్టం యొక్క సవరించిన కార్యనిర్వాహక నిబంధనల ప్రకారం.. పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్య ప్రాజెక్ట్ కోసం కనీస పరిమితి SR 200 మిలియన్లుగా ఉంది. ఆస్తి యాజమాన్య ప్రాజెక్ట్ల బదిలీకి కనీస విలువను SR 50 మిలియన్లుగా నిబంధనల్లో పేర్కొన్నారు. డిసెంబర్ 31, 2023న నేషనల్ సెంటర్ ఫర్ ప్రైవేటైజేషన్ & PPP (NCP) డైరెక్టర్ల బోర్డు చేసిన సవరణలను ఆమోదించిన తర్వాత, సౌదీ అరేబియా అధికారిక గెజిట్ ఉమ్ అల్-ఖురా శుక్రవారం ప్రైవేటీకరణ చట్టం యొక్క సవరించిన నిబంధనల వివరాలను ప్రచురించింది. ప్రైవేటీకరణ సూత్రాలు, ప్రైవేటీకరణ ప్రాజెక్ట్ యొక్క కనీస విలువ, ప్రైవేటీకరణ ప్రాజెక్టులకు సిస్టమ్ను వర్తింపజేయడానికి ప్రమాణాలతో సహా 169 ఆర్టికల్స్ ను ఇందులో పొందుపరిచారు. ప్రైవేటీకరణ చట్టం యొక్క కార్యనిర్వాహక నిబంధనలను రూపొందించే క్రమంలో ప్రైవేటీకరణ ప్రాజెక్టులను అమలు చేయడంలో అంతర్జాతీయ పద్ధతులు, స్థానిక అనుభవాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా దీనిని అభివృద్ధి చేసినట్లు కౌన్సిల్ పేర్కొంది. నిబంధనలలో ఆర్టికల్ మూడు.. ప్రైవేటీకరణ ప్రాజెక్ట్ యొక్క కనీస విలువను నిర్దేశిస్తుంది. ఇది లక్ష్య ఆస్తుల కోసం కార్యనిర్వాహక సంస్థ నిర్ణయించిన అంచనా విలువ ఆధారంగా, ఆస్తి యాజమాన్య ప్రాజెక్ట్ యొక్క బదిలీకి కనీస విలువను SR 50 మిలియన్లుగా పేర్కొన్నారు. పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్య ప్రాజెక్ట్కు కనీస పరిమితి SR200 మిలియన్లు అని నిర్ణయించారు. సౌదీ అరేబియా 2018 లో ప్రైవేటీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. జాతీయ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి మద్దతు ఇవ్వడం, ప్రైవేట్ రంగం పాత్రను మెరుగుపరచడం మరియు అనేక రంగాలలో కేటాయించగల ప్రభుత్వ ఆస్తులు, సేవలు మరియు వనరులను గుర్తించడమే లక్ష్యంగా ఈ ప్రోగ్రామ్ ని అమల్లోకి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమం సౌదీ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి.. వైవిధ్యతకు దోహదం చేస్తుంది. అదే సమయంలో పౌరులకు అనేక అవకాశాలను అందిస్తుంది.
తాజా వార్తలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత
- ఖమేనీ అంత్యక్రియలకు ప్రధాని మోదీ దూరం..
- నెలల విరామం తర్వాత ఇరాన్–యూఏఈ మధ్య విమాన సర్వీసులు పునఃప్రారంభం
- సెమీకండక్టర్–ఏఐ అవకాశాలకు తైవాన్కు ICIE ఆహ్వానం
- తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు..డీజీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు







