కరెంటు బిల్లు చెల్లించలేదని రూమ్మేట్పై దాడి.. ఆసియా వ్యక్తికి జైలుశిక్ష
- February 05, 2024
బహ్రెయిన్ : బహ్రెయిన్లో కరెంటు బిల్లు చెల్లించలేదని తన రూమ్మేట్పై హింసాత్మకంగా దాడి చేసిన 24 ఏళ్ల ఆసియా వ్యక్తికి మూడు సంవత్సరాల జైలుశిక్షను విధించింది కోర్టు. దాడి కారణంగా బాధితుడి ముఖం శాశ్వతంగా వైకల్యానికి గురైంది. బహ్రెయిన్ హై క్రిమినల్ కోర్ట్ కూడా దుండగుడిని అతని జైలు శిక్ష పూర్తయిన తర్వాత బహిష్కరించాలని ఆదేశించింది. దాడి ఫలితంగా బాధితుడి ముఖంపై 5% వైకల్యం ఉందని కోర్టు నియమించిన వైద్య కమిటీ నిర్ధారించింది. కోర్టు రికార్డుల ప్రకారం.. వారుండే రూమ్ లో విద్యుత్ బిల్లును పంచుకోవడంపై తీవ్రమైన వాదనలు జరిగిన తర్వాత వాగ్వాదం జరిగింది. ఇద్దరు వ్యక్తులు సంయుక్తంగా కరెంటు బిల్లును చెల్లించారు. అయితే డిస్కనెక్షన్ను నిరోధించేందుకు బాధితుడు, నిందితుడు తన బాకీ ఉన్న భాగాన్ని సెటిల్ చేయమని కోరడంతో మరోసారి వాగ్వాదం జరిగింది. అయితే, నిందితులు పాటించడంలో విఫలం కావడంతో వారి అపార్ట్మెంట్లో విద్యుత్ను నిలిపివేశారు. వివాదం హింసకు దారితీసింది. నిందితుడు కత్తిని చూపించి, బాధితుడి కుడి చెంపపై కొట్టడంతో అతను స్పృహ కోల్పోయాడు. సాక్ష్యాలను సమీక్షించిన తర్వాత నిందితుడిని కోర్టు దోషిగా నిర్ధారించి తీర్పును వెలువరించింది.
తాజా వార్తలు
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత
- ఖమేనీ అంత్యక్రియలకు ప్రధాని మోదీ దూరం..
- నెలల విరామం తర్వాత ఇరాన్–యూఏఈ మధ్య విమాన సర్వీసులు పునఃప్రారంభం
- సెమీకండక్టర్–ఏఐ అవకాశాలకు తైవాన్కు ICIE ఆహ్వానం
- తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు..డీజీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు
- టాక్స్ పేయర్లు, సామాన్యులకు అలర్ట్..
- వైజాగ్ విమాన ప్రయాణాల్లో చారిత్రాత్మక మార్పు
- ఇరాన్ అంశం పై మంగళవారం దోహాలో కీలక సమావేశం: ట్రంప్







