ఒమన్‌లో పర్యటించనున్న కువైట్ ఎమిర్

- February 05, 2024 , by Maagulf
ఒమన్‌లో పర్యటించనున్న కువైట్ ఎమిర్

మస్కట్: కువైట్ రాష్ట్ర ఎమిర్ హెచ్‌హెచ్ షేక్ మిషాల్ అల్ అహ్మద్ అల్ జబర్ అల్ సబా మంగళవారం ఒమన్ సుల్తానేట్‌లో పర్యటించనున్నారు. ఈ మేరకు దివాన్ ఆఫ్ రాయల్ కోర్ట్ ఒక ప్రకటనలో తెలిపింది. సుల్తానేట్ ఆఫ్ ఒమన్ లో కువైట్ ఎమిర్ రెండు రోజులు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పరస్పర ఆసక్తి ఉన్న అనేక రంగాలు, అంశాలపై చర్చలు జరుపుతారు.  ఫిబ్రవరి 7న డుక్మ్ రిఫైనరీ మరియు పెట్రోకెమికల్ పరిశ్రమల ప్రారంభోత్సవానికి కువైట్ ఎమిర్ హిజ్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్‌తో కలిసి హాజరవుతారు. ఇది రెండు దేశాల మధ్య విజయవంతమైన ఆర్థిక సహకారానికి సంబంధించిన అధునాతన సంబంధాలకు నిదర్శనంగా ఈ పరిశ్రమను పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com