డేటాను అప్‌డేట్ చేసుకోండి.. వినియోగదారులను కోరిన రెగ్యులేటరీ అథారిటీ

- February 05, 2024 , by Maagulf
డేటాను అప్‌డేట్ చేసుకోండి.. వినియోగదారులను కోరిన రెగ్యులేటరీ అథారిటీ

కువైట్: కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రెగ్యులేటరీ అథారిటీ (CITRA) ఆదివారం మొబైల్, ఫిక్స్‌డ్ సబ్‌స్క్రైబర్‌లను సేవల కొనసాగింపునకు వారి డేటాను అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది. కాంపిటీషన్ మరియు ఆపరేటర్స్ అఫైర్స్ డిపార్ట్‌మెంట్ మేనేజర్ ఖలీద్ అల్-ఖరావీ మాట్లాడుతూ.. కమ్యూనికేషన్ సేవలకు చందాదారుల నమోదు జాబితా అన్ని లైసెన్స్ పొందిన కంపెనీలు తమ కస్టమర్‌లను తమ గడువు ముగిసిన వ్యక్తిగత డేటా,  కంపెనీలతో నమోదు చేసుకున్న సమాచారాన్ని అప్‌డేట్ చేసుకోవాలన్నారు. జైన్, ఊరిడూ మరియు ఎస్టీసీ వంటి మొబైల్ టెలికమ్యూనికేషన్ కంపెనీల సబ్‌స్క్రైబర్‌లు  కూడా తమ సివిల్ ఐడిని ఆన్‌లైన్ ద్వారా లేదా వారి మొబైల్ యాప్‌ల ద్వారా నిరంతరాయంగా సేవలను పొందడానికి అప్‌డేట్ చేసుకోవాలని వినియోగదారులను కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com