మానవీయ కోణంలో ఇద్దరు తల్లులకు జైలు శిక్ష రద్దు
- June 01, 2016
బహ్రెయిన్, ఇద్దరు తల్లుల జైలు శిక్షను రద్దు చేసింది. అంబుడ్స్మెన్ ఆఫీస్ రికమండేషన్స్తో జైనబ్ అల్ ఖావ్జా, అరినా బజ్తోవా అనే మహిళల విడుదలకు మార్గం సుగమం అయ్యింది. యాక్టింగ్ అటార్నీ జనరల్ ఆఫ్ ది పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆఫీస్, అబ్దుల్ రహ్మాన్ అల్ సయ్యెద్ చెబుతూ, అంబుడ్స్మెన్ కార్యాలయ సభ్యులు జైలును సందర్శించి, అక్కడ ఆ ఇద్దరు మహిళల పరిస్థితిని తెలుసుకున్నారు. అల్ ఖావ్జా 16 నెలల కుమారుడిని కలిగి ఉండగా, బజ్తోవా నాలుగేళ్ళ కుమారుడిని కలిగి ఉన్నారు. తమ పిల్లలతో వీరిద్దరూ జైల్లో ఉన్నారు. జైల్లో పిల్లలకు తగిన సౌకర్యాలు అందుతున్నప్పటికీ, వారి భవిష్యత్తుపై జైలు జీవితం తీవ్ర ప్రభావం చూపుతుందన్న కోణంలో, వారిని విడుదల చేయాల్సిందిగా అంబుడ్స్మెన్ రికమెండేషన్ చేసింది. ఈ రికమండేషన్ని బేస్ చేసుకుని, పబ్లిక్ ప్రాసిక్యూషన్, న్యాయస్థానానికి పరిస్థితిని వివరించింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి, వారిపై ఉన్న శిక్షను రద్దు చేశారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









