మానవీయ కోణంలో ఇద్దరు తల్లులకు జైలు శిక్ష రద్దు
- June 01, 2016
బహ్రెయిన్, ఇద్దరు తల్లుల జైలు శిక్షను రద్దు చేసింది. అంబుడ్స్మెన్ ఆఫీస్ రికమండేషన్స్తో జైనబ్ అల్ ఖావ్జా, అరినా బజ్తోవా అనే మహిళల విడుదలకు మార్గం సుగమం అయ్యింది. యాక్టింగ్ అటార్నీ జనరల్ ఆఫ్ ది పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆఫీస్, అబ్దుల్ రహ్మాన్ అల్ సయ్యెద్ చెబుతూ, అంబుడ్స్మెన్ కార్యాలయ సభ్యులు జైలును సందర్శించి, అక్కడ ఆ ఇద్దరు మహిళల పరిస్థితిని తెలుసుకున్నారు. అల్ ఖావ్జా 16 నెలల కుమారుడిని కలిగి ఉండగా, బజ్తోవా నాలుగేళ్ళ కుమారుడిని కలిగి ఉన్నారు. తమ పిల్లలతో వీరిద్దరూ జైల్లో ఉన్నారు. జైల్లో పిల్లలకు తగిన సౌకర్యాలు అందుతున్నప్పటికీ, వారి భవిష్యత్తుపై జైలు జీవితం తీవ్ర ప్రభావం చూపుతుందన్న కోణంలో, వారిని విడుదల చేయాల్సిందిగా అంబుడ్స్మెన్ రికమెండేషన్ చేసింది. ఈ రికమండేషన్ని బేస్ చేసుకుని, పబ్లిక్ ప్రాసిక్యూషన్, న్యాయస్థానానికి పరిస్థితిని వివరించింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి, వారిపై ఉన్న శిక్షను రద్దు చేశారు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







