మానవీయ కోణంలో ఇద్దరు తల్లులకు జైలు శిక్ష రద్దు
- June 01, 2016
బహ్రెయిన్, ఇద్దరు తల్లుల జైలు శిక్షను రద్దు చేసింది. అంబుడ్స్మెన్ ఆఫీస్ రికమండేషన్స్తో జైనబ్ అల్ ఖావ్జా, అరినా బజ్తోవా అనే మహిళల విడుదలకు మార్గం సుగమం అయ్యింది. యాక్టింగ్ అటార్నీ జనరల్ ఆఫ్ ది పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆఫీస్, అబ్దుల్ రహ్మాన్ అల్ సయ్యెద్ చెబుతూ, అంబుడ్స్మెన్ కార్యాలయ సభ్యులు జైలును సందర్శించి, అక్కడ ఆ ఇద్దరు మహిళల పరిస్థితిని తెలుసుకున్నారు. అల్ ఖావ్జా 16 నెలల కుమారుడిని కలిగి ఉండగా, బజ్తోవా నాలుగేళ్ళ కుమారుడిని కలిగి ఉన్నారు. తమ పిల్లలతో వీరిద్దరూ జైల్లో ఉన్నారు. జైల్లో పిల్లలకు తగిన సౌకర్యాలు అందుతున్నప్పటికీ, వారి భవిష్యత్తుపై జైలు జీవితం తీవ్ర ప్రభావం చూపుతుందన్న కోణంలో, వారిని విడుదల చేయాల్సిందిగా అంబుడ్స్మెన్ రికమెండేషన్ చేసింది. ఈ రికమండేషన్ని బేస్ చేసుకుని, పబ్లిక్ ప్రాసిక్యూషన్, న్యాయస్థానానికి పరిస్థితిని వివరించింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి, వారిపై ఉన్న శిక్షను రద్దు చేశారు.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







