ఇజ్రాయెల్తో దౌత్య సంబంధాలపై సౌదీ కీలక ప్రకటన
- February 07, 2024
రియాద్: స్వతంత్ర పాలస్తీనా దేశం లేకుండా ఇజ్రాయెల్తో 'దౌత్య సంబంధాలు లేవు' అని సౌదీ అరేబియా స్పష్టం చేసింది. పాలస్తీనా సమస్యపై అమెరికాకు తన దృఢమైన వైఖరిని తెలియజేసింది. తూర్పు జెరూసలేంతో 1967 సరిహద్దుల్లో స్వతంత్ర పాలస్తీనా రాజ్యాన్ని గుర్తించి, గాజా స్ట్రిప్పై ఇజ్రాయెల్ "దూకుడు" ఆగితే తప్ప ఇజ్రాయెల్తో దౌత్య సంబంధాలు ఉండవని సౌదీ అరేబియా బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. సౌదీ అరేబియా విదేశాంగ మంత్రిత్వ శాఖ యొక్క X ఖాతా ద్వారా కూడా ఈ ప్రకటనను విడుదల చేశారు. "అరబ్-ఇజ్రాయెల్ శాంతి ప్రక్రియపై సౌదీ అరేబియా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మధ్య చర్చలు జరిగాయి. పాలస్తీనా సమస్యపై సౌదీ అరేబియా తన దృఢమైన వైఖరిని కలిగిఉంది. పాలస్తీనా ప్రజలు తమ చట్టబద్ధమైన హక్కులను పొందవలసిన ఆవశ్యకత ఉంది. " అని పేర్కొంది. ఇదిలా ఉండగా మంగళవారం వైట్ హౌస్ జాతీయ భద్రతా ప్రతినిధి జాన్ కిర్బీ మాట్లాడుతూ..సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ సాధారణీకరణ చర్చలను కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. కిర్బీ వ్యాఖ్యల నేపథ్యంలో పాలస్తీనా సమస్యపై వాషింగ్టన్కు తన దృఢమైన వైఖరిని తెలియజేస్తూ సౌద అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.
తాజా వార్తలు
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత
- ఖమేనీ అంత్యక్రియలకు ప్రధాని మోదీ దూరం..
- నెలల విరామం తర్వాత ఇరాన్–యూఏఈ మధ్య విమాన సర్వీసులు పునఃప్రారంభం
- సెమీకండక్టర్–ఏఐ అవకాశాలకు తైవాన్కు ICIE ఆహ్వానం
- తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు..డీజీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు
- టాక్స్ పేయర్లు, సామాన్యులకు అలర్ట్..
- వైజాగ్ విమాన ప్రయాణాల్లో చారిత్రాత్మక మార్పు
- ఇరాన్ అంశం పై మంగళవారం దోహాలో కీలక సమావేశం: ట్రంప్
- అబుదాబిలో డ్రైవర్కు జైలు శిక్ష.. 70,000 దిర్హమ్ల ఫైన్..!!
- సౌదీ అరేబియాకు పలు గల్ఫ్, అరబ్ దేశాలు సంతాపం..!!







