మానసిక ఆరోగ్య చట్టాన్ని ఉల్లంఘిస్తే Dh200,000 వరకు జరిమానా, జైలు శిక్ష
- February 07, 2024
యూఏఈ: కొత్తగా ప్రవేశపెట్టిన ఫెడరల్ చట్టం మే 30, 2024 నుండి అమలులోకి వస్తుంది. దీని ప్రకారం మానసిక ఆరోగ్య రోగులకు చికిత్స చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే Dh200,000 జరిమానా మరియు రోగికి తీవ్రమైన గాయం లేదా శారీరక వైకల్యానికి కారణమైతే కనీసం ఒక సంవత్సరం జైలు శిక్షను విధిస్తారు. కొత్త చట్టంలో మానసిక ఆరోగ్య రోగులకు సంబంధించిన అనేక రకాల కొత్త నిబంధనలతో పాటు జరిమానాల వివరాలను పొందుపరిచారు. గలాదరి లీగల్ కన్సల్టెంట్ సీనియర్ న్యాయవాది స్టీఫెన్ బాలంటైన్ మాట్లాడుతూ..ఒక వ్యక్తిని మానసిక ఆరోగ్య సౌకర్యం కోసం అనుమతించడం లేదా డిశ్చార్జ్ చేయడం కోసం ఉద్దేశపూర్వకంగా సరికాని సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా అందించిన వారికి చట్టం కఠినమైన జరిమానాలను విధిస్తుంది. వీటితో పాటు ఎవరైనా ఉద్దేశపూర్వకంగా అతని/ఆమె మెడికల్ రిపోర్ట్లో మానసిక స్థితికి సంబంధించి వాస్తవికతకు విరుద్ధంగా పేర్కొన్నట్టయితే చట్టం Dh50,000 కంటే తక్కువ కాకుండా మరియు Dh200,000 మించకుండా జైలు శిక్ష లేదా జరిమానా విధిస్తుంది. మానసిక ఆరోగ్య పరిస్థితులతో బాధపడేవారికి తగిన సంరక్షణ మరియు వారికి తగిన గౌరవం లభించేలా చూడడానికి జరిమానాలు ప్రవేశపెట్టబడ్డాయి అని బాలంటైన్ తెలిపారు.
తాజా వార్తలు
- భారత్-ఇజ్రాయెల్ విమాన సర్వీసుల నిలిపివేత
- సెయింట్ లూయిస్ ఫుడ్ బ్యాంక్లో ‘NATS’ సేవలు
- మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్ఓపి హెచ్చరిక..!!
- Metrash ద్వారా రెసిడెన్స్ పర్మిట్ పునరుద్ధరించే విధానం..!!
- డ్రోన్ దాడిలో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించిన ఆర్థిక మంత్రి..!!
- భారీ బడ్జెట్ తో స్మార్ట్ క్లాస్రూమ్ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన ISB..!!
- అరఫా డే, ఈద్ అల్ అదా..లాంగెస్ట్ పబ్లిక్ హాలీడే..!!
- సౌదీ అరేబియాలో పలు ప్రాంతాలలో భారీ వర్షాలు..!!
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్









