విషాదం..ఫిబ్రవరి 16న నిశ్చితార్థం.. ఒమన్లో భారత యువకుడు మృతి
- February 15, 2024
మస్కట్: భారతదేశంలోని తన నిశ్చితార్థ వేడుకకు కొద్ది రోజుల ముందు ఒమన్లో భారీ వర్షాలలో భారతీయ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. అతని అకాల మరణ వార్త అతని స్నేహితులు, కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. 28 ఏళ్ల అబ్దుల్లా వాహిద్ ఒక ప్రైవేట్ సంస్థలో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నాడు. సూర్ నుండి మస్కట్కు తిరిగి వస్తుండగా అతను సోమవారం ఇబ్రాలోని వాడిని దాటుతుండగా వరద ధాటికి కొట్టుకుపోయాడు. అతని సహోద్యోగి ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఈ ఘటనపై మస్కట్లోని కేరళ ముస్లిం కల్చర్ సెంటర్ (KMCC) ప్రతినిధి మహ్మద్ వానిమెల్ విచారం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 16న వాహిద్ నిశ్చితార్థం జరగాల్సి ఉండగా, కేరళలోని అలెప్పీ జిల్లాలో అతని కుటుంబం వేడుకల కోసం ఏర్పాట్లు కూడా చేసిందన్నారు.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







