విషాదం..ఫిబ్రవరి 16న నిశ్చితార్థం.. ఒమన్‌లో భారత యువకుడు మృతి

- February 15, 2024 , by Maagulf
విషాదం..ఫిబ్రవరి 16న నిశ్చితార్థం.. ఒమన్‌లో భారత యువకుడు మృతి

మస్కట్: భారతదేశంలోని తన నిశ్చితార్థ వేడుకకు కొద్ది రోజుల ముందు ఒమన్‌లో భారీ వర్షాలలో భారతీయ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. అతని అకాల మరణ వార్త అతని స్నేహితులు, కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. 28 ఏళ్ల అబ్దుల్లా వాహిద్ ఒక ప్రైవేట్ సంస్థలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడు. సూర్ నుండి మస్కట్‌కు తిరిగి వస్తుండగా అతను సోమవారం ఇబ్రాలోని వాడిని దాటుతుండగా వరద ధాటికి కొట్టుకుపోయాడు. అతని సహోద్యోగి ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఈ ఘటనపై  మస్కట్‌లోని కేరళ ముస్లిం కల్చర్ సెంటర్ (KMCC) ప్రతినిధి మహ్మద్ వానిమెల్ విచారం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 16న వాహిద్ నిశ్చితార్థం జరగాల్సి ఉండగా, కేరళలోని అలెప్పీ జిల్లాలో అతని కుటుంబం వేడుకల కోసం ఏర్పాట్లు కూడా చేసిందన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com