దుబాయ్‌లో కొత్త సీబీఎస్‌ఈ కార్యాలయం: ప్రధాని మోదీ

- February 15, 2024 , by Maagulf
దుబాయ్‌లో కొత్త సీబీఎస్‌ఈ కార్యాలయం: ప్రధాని మోదీ

యూఏఈ: యూఏఈలో అత్యుత్తమ విద్యను అందించాలనే నిబద్ధతను ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. దుబాయ్‌లో త్వరలో కొత్త సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సిబిఎస్‌ఇ) కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. అబుదాబిలో జరిగిన 'అహ్లాన్ మోడీ' డయాస్పోరా కార్యక్రమంలో సభను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. "యూఏఈ పాఠశాలల్లో 1.5 లక్షల మందికి పైగా భారతీయ విద్యార్థులు చదువుతున్నారు. దుబాయ్‌లో త్వరలో కొత్త CBSE కార్యాలయం ప్రారంభించబడుతుంది. ఈ సంస్థలు ఇక్కడి భారతీయ సమాజానికి అత్యుత్తమ విద్యను అందించడంలో సహాయపడతాయి". అని పేర్కొన్నారు. విద్యా కార్యక్రమాలతో పాటు మెగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్‌లు, శక్తివంతమైన పర్యాటకం మరియు క్రీడా నైపుణ్యానికి భారతదేశం ప్రపంచ గుర్తింపు పొందిందని మోదీ అన్నారు. మంగళవారం అబుదాబికి చేరుకున్న ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలపై ఇరువురు నేతలు సమావేశమయ్యారు. IIT ఢిల్లీ-అబుదాబి క్యాంపస్‌లోని మొదటి బ్యాచ్ విద్యార్థులతో ప్రధాని సంభాషించారు. రెండు దేశాల విద్యార్థులను ఒక చోటికి చేర్చినందుకు ప్రాజెక్ట్‌ రూపకర్తలను ప్రశంసించారు. ఇది భారతదేశం, యూఏఈ మధ్య ద్వైపాక్షిక సహకారంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడమే కాకుండా, రెండు దేశాల యువతను ఏకతాటిపైకి తీసుకువస్తుందని ప్రధాని మోదీ అన్నారు. యూఏఈలో ఢిల్లీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ క్యాంపస్‌ను ఫిబ్రవరి 2022లో స్థాపించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com