ఈ-కేవైసీ పై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
- February 16, 2024
అమరావతి: ఏపీ రైతులకు జగన్ సర్కార్ ఈ-కేవైసీపై కీలక ప్రకటన చేసింది . ప్రస్తుత రబీ సీజన్ లో ఈ-క్రాప్, ఈ-కేవైసీ నమోదు ప్రక్రియను ఈ నెల 22లోగా పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ రైతులను ఆదేశించింది. రబీలో సాగయ్యే శనగ, మొక్కజొన్న, మినుము పంటలు కోతకు వచ్చే సమయం దగ్గర పడుతుందని తెలిపారు అధికారులు. త్వరగా ఈ-క్రాప్, ఈ-కేవైసీల నమోదును పూర్తి చేయాలంది. అటు పీఎం కిసాన్ 16వ విడత నిధులు త్వరలో విడుదల కానుండటంతో ఇంకా ఆధార్ తో బ్యాంకు అకౌంట్లు లింక్ చేయనివారు వెంటనే ఆ ప్రక్రియ పూర్తిచేయాలని తెలిపింది. కాగా కాకినాడ జిల్లా అన్నవరం రైల్వే స్టేషన్ కు అరుదైన గుర్తింపు దక్కింది. FSSAI నుంచి ఈట్ రైట్ స్టేషన్ అవార్డును సొంతం చేసుకుంది. విజయవాడ డివిజన్ లో ఈ హోదా పొందిన తొలి స్టేషన్ ఇదే కాగా….జోన్ లో నాంపల్లి తర్వాత రెండవ స్థానంలో నిలిచింది.
తాజా వార్తలు
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్
- యూఏఈలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల సేవల్లో అంతరాయాలు..!!
- స్ట్రాటజిక్ మెడిసిన్స్, మెడికల్ సప్లై తనిఖీ చేసిన కువైట్ పీఎం..!!
- అనేక ఫ్లైట్స్ రద్దు చేసిన ఒమన్ ఎయిర్..!!
- పౌరులు, నివాసితులు, విజిటర్స్ భద్రతకు సౌదీ భరోసా..!!
- బహ్రెయిన్ లో క్యాంపింగ్ సీజన్ సస్పెండ్..!!
- ఖతార్లో అధిక సామర్థ్యంతో పనిచేస్తున్న ఫుడ్ ఫ్యాక్టరీస్..!!
- ఫుజైరా ఆయిల్ జోన్లో అగ్నిప్రమాదం, కూలిన డ్రోన్ శకలాలు: అదుపులోకి తెచ్చిన అధికారులు!
- కోమ్ నుండి టెహ్రాన్కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు
- ఒమాన్లోని డుక్మ్ పోర్ట్ పై డ్రోన్ దాడి









