రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రముఖులకు అవార్డులు..
- June 02, 2016
రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం పలువురు ప్రముఖులకు ప్రకటించిన అవార్డుల ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. ఇవాళ హెచ్ఐసీసీలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుతోపాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీతలకు సీఎం కేసీఆర్, గవర్నర్ నరసింహన్ అవార్డులను ప్రదానం చేశారు. అవార్డు గ్రహీతలకు రూ.లక్షా 116 నగదు పురస్కారంతోపాటు శాలువా, సర్టిఫికెట్, మొమెంటోతో సత్కరించారు. కాగా, రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మొత్తం 29 విభాగాల నుంచి 62 మంది ప్రముఖులను ప్రభుత్వం అవార్డులకు ఎంపిక చేసింది. అవార్డులకు ఎంపికైన వారిలో సాహిత్యం-7, నృత్యం-2, జానపద నృత్యం-1, సంగీతం-2, జానపద సంగీతం-5, ఉద్యమగానం-3, పెయింటింగ్-1, వేద పండితులు-1, అర్చకులు-2, ఆధ్యాత్మికం-1, సైంటిస్టులు-3, జర్నలిస్టులు-6, హస్త కళలు-6, క్రీడలు-2, ఉద్యోగులు-9, వైద్యులు-1, ఎన్జీవో-1, సోషల్ వర్క్-1, రైతులు-3, అంగన్వాడీ వర్కర్స్-1, ఉత్తమ మున్సిపాలిటీగా ఖమ్మం, ఉత్తమ గ్రామ పంచాయతీలు-3, న్యాయవాదులు-1, ఔత్సాహికులు-1, టీచర్లు-2, ఆధునిక రైతు-1, మాజీ సైనికులు-2, ధైర్యసాహసాలు-1 ఉన్నారు
తాజా వార్తలు
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు







