పిల్లల వద్ద పొగతాగుతున్నారా? Dh5,000 కంటే ఎక్కువ జరిమానా..!
- February 20, 2024
యూఏఈ: యఏఈలోని నివాసితులలో ధూమపానం అలవాటు అధికం.ఇ-సిగరెట్లు మరియు వేప్ల రాకతో ధూమపానం చేసేవారి సంఖ్య పెరుగుతోంది. మరోవైపు పొగాకు సంబంధిత ఉత్పత్తులను కొనుగోలు చేయడం మరియు వాటిని ఉపయోగించడం సులభం అయింది. యూఏఈలోని నిపుణుల ప్రకారం.. ధూమపానం చేయని వ్యక్తులు ధూమపానం చేసే వ్యక్తులతో సమానమైన ఆరోగ్య ప్రభావాలను అనుభవిస్తారు. ఇది పిల్లలకు కూడా వర్తిస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు పొగాకు ప్రతి సంవత్సరం 8 మిలియన్ల కంటే ఎక్కువ మంది చనిపోతున్నారు. ఇందులో పొగతాగే అలవాటు లేని 1.3 మిలియన్ల మంది పొగతాగేవారి పొగకు బలవుతున్నారు. యూఏఈలో పిల్లల చుట్టూ ధూమపానాన్ని ఎదుర్కోవడానికి కఠినమైన చట్టాలను ఏర్పాటు చేసింది. అలాగే మైనర్లకు పొగాకు సంబంధిత ఉత్పత్తులను అమ్మటంపై నిషేధం ఉంది.
దేశంలో బాలల హక్కులను స్థాపించే వడీమా చట్టం ప్రకారం పిల్లల సమక్షంలో ధూమపానం చేయడంపై నిషేధం ఉంది. ఆర్టికల్ 21 ప్రకారం.. 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల సమక్షంలో ఏదైనా ప్రభుత్వ మరియు ప్రైవేట్ రవాణా మార్గాలలో ధూమపానం చేయడం ఖచ్చితంగా నేరం అవుతుంది. చట్టాన్ని ఉల్లంఘించిన వారికి 5,000 దిర్హామ్లకు తక్కువ కాకుండా జరిమానా విధిస్తారు. పిల్లలకు పొగాకు ఉత్పత్తులను విక్రయించే లేదా విక్రయించడానికి ప్రయత్నించే వ్యక్తులకు కనీసం 3 నెలల జైలు శిక్ష మరియు/లేదా Dh15,000 కంటే తక్కువ జరిమానా విధించబడుతుంది.
తాజా వార్తలు
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!







