పిల్లల వద్ద పొగతాగుతున్నారా? Dh5,000 కంటే ఎక్కువ జరిమానా..!
- February 20, 2024
యూఏఈ: యఏఈలోని నివాసితులలో ధూమపానం అలవాటు అధికం.ఇ-సిగరెట్లు మరియు వేప్ల రాకతో ధూమపానం చేసేవారి సంఖ్య పెరుగుతోంది. మరోవైపు పొగాకు సంబంధిత ఉత్పత్తులను కొనుగోలు చేయడం మరియు వాటిని ఉపయోగించడం సులభం అయింది. యూఏఈలోని నిపుణుల ప్రకారం.. ధూమపానం చేయని వ్యక్తులు ధూమపానం చేసే వ్యక్తులతో సమానమైన ఆరోగ్య ప్రభావాలను అనుభవిస్తారు. ఇది పిల్లలకు కూడా వర్తిస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు పొగాకు ప్రతి సంవత్సరం 8 మిలియన్ల కంటే ఎక్కువ మంది చనిపోతున్నారు. ఇందులో పొగతాగే అలవాటు లేని 1.3 మిలియన్ల మంది పొగతాగేవారి పొగకు బలవుతున్నారు. యూఏఈలో పిల్లల చుట్టూ ధూమపానాన్ని ఎదుర్కోవడానికి కఠినమైన చట్టాలను ఏర్పాటు చేసింది. అలాగే మైనర్లకు పొగాకు సంబంధిత ఉత్పత్తులను అమ్మటంపై నిషేధం ఉంది.
దేశంలో బాలల హక్కులను స్థాపించే వడీమా చట్టం ప్రకారం పిల్లల సమక్షంలో ధూమపానం చేయడంపై నిషేధం ఉంది. ఆర్టికల్ 21 ప్రకారం.. 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల సమక్షంలో ఏదైనా ప్రభుత్వ మరియు ప్రైవేట్ రవాణా మార్గాలలో ధూమపానం చేయడం ఖచ్చితంగా నేరం అవుతుంది. చట్టాన్ని ఉల్లంఘించిన వారికి 5,000 దిర్హామ్లకు తక్కువ కాకుండా జరిమానా విధిస్తారు. పిల్లలకు పొగాకు ఉత్పత్తులను విక్రయించే లేదా విక్రయించడానికి ప్రయత్నించే వ్యక్తులకు కనీసం 3 నెలల జైలు శిక్ష మరియు/లేదా Dh15,000 కంటే తక్కువ జరిమానా విధించబడుతుంది.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







